చిరంజీవితో సత్సంబంధాలు..వాటితో నాకు సంబంధం లేదు: వారి కుట్రే: చెవిరెడ్డి..!
ముఖ్యమంత్రి జగన్ మెగాస్టార్ చిరంజీవి భేటీ ఖరారైన సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి అభిమాన సంఘం పేరుతో పోస్టింగ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. వీటి మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. గతంలో జగన్ అరెస్ట్ సమయంలో రాం చరణ్ చేసిన కామెంట్ ను అందులో ప్రస్తావించారు. అదే సమయంలో నాడు వైయస్ కుటుంబం మీద కసిగా వ్యవహరించిన మెగా కుటుంబం నేడు ముఖ్యమంత్రి జగన్ అప్పాయింట్ మెంట్ కోసం నిరీక్షిస్తున్నారంటూ పేర్కొన్నారు. అదే కాల మహిమ అంటూ పోస్ట్ చేసారు.
దీని మీద వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వివరణ ఇచ్చారు. తన అభిమాన సంఘం పేరిట చిరంజీవి పైన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగ్ లకు తనకు ఎటువంటి సంబంధలేని స్పష్టం చేసారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

చిరంజీవితో మంచి సంబంధాలున్నాయి..
మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగులకూ తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ట్విట్టర్ అక్కౌంట్లు కాని, ఫేస్బుక్ అక్కౌంట్లుగాని లేవని తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు చెవిరెడ్డి. అప్పటినుంచి ఆయనతో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు.
జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని చెవిరెడ్డి ఆరోపించారు. తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవన్నారు చెవిరెడ్డి. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉంటాయన్నారు. తాను కూడా జగనన్న అభిమానియే అన్నారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
14న ముఖ్యమంత్రితో చిరంజీవి లంచ్ మీటింగ్..
ఇది ఇలా ఉండగా..ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి భేటీ కావాలని నిర్ణయించారు. తనతో భేటీ కావాలనుకుంటున్నానని చిరంజీవి నుండి సమాచారం రాగానే..స్పందించిన ముఖ్యమంత్రి లంచ్ కు తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. ఈ నెల 14న మధ్యాహ్నం ముఖ్యమంత్రి నివాసంలో చిరంజీవి..రాం చరణ్ కు లంచ్ ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా సైరా సినిమా వీక్షించాల్సిందిగా చిరంజీవి ముఖ్యమంత్రిని ఆహ్వానించే అవకాశం ఉంది.
కొద్ది కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న చిరంజీవి రాష్ట్ర విభజన తరువాత అధికారంలో ఉన్న చంద్రబాబును ఏనాడు కలవలేదు. ఇక, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నారు. అయితే, పూర్తిగా ఇది సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే జరుగుతున్న సమావేశంగా మంత్రులు చెబుతున్నారు. కానీ, ఈ సమావేశం మీద రాజకీయంగా..అదే విధంగా సినీ ఇండస్ట్రీ లోనూ పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications