అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ నాయకుడి హత్య.. వైరల్ గా 'మర్డర్ ప్లాన్'!

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి నేత హత్యకు నిందితులు వేసిన ప్రణాళిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూపురం నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి ఈనెల 8వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆరోజు రామకృష్ణారెడ్డి ఎవరెవరిపై అనుమానం వ్యక్తం చేశారో వారందరి విషయాలు, వారు హత్యకు వేసిన ప్రణాళిక ఆ ఆడియోలో ఉన్నాయి.

కేసులో ప్రధాన నిందితుడిగా మంజునాథ్ అలియాస్ వరుణ్ ఉన్నారు. ఆయన మరో నిందితుడు మహేష్ తో మట్లాడిన మాటలు, అలాగే మరో ఆడియోలో వరుణ్, మూర్తి అనే వ్యక్తితో మాట్లాడటం, మధ్యలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణతో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడటంలాంటి విషయాలన్నీ ఉన్నాయి.

ysrcp leader ramakrishna reddy murder plan in audio

రామకృష్ణారెడ్డిని ఏం చేసినా ఏమీ కాదని, పోలీసులు ఏమీ చేయరని, సీఐ తనతో రోజూ మాట్లాడుతున్నారని వరుణ్ మహేష్ కు వివరించినట్లు ఆ ఆడియోలో నమోదైంది. ఎమ్మెల్సీ పీఏ రామకృష్ణారెడ్డిని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఊరుకున్నారని, మనమైతే పని పూర్తిచేయగలమని తెలుసుకొని నాగన్నద్వారా సంప్రదించారనే విషయంపై నిందితులు మాట్లాడుకున్నారు.

అలాగే మరో ఆడియోలో వరుణ్ తో మూర్తి అనే వ్యక్తి మాట్లాడారు. ఎమ్మెల్సీ సార్ ఎదుట తాను కూర్చుంటానని, మీమీద పోలీసులు ఒక్క దెబ్బ వేయకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడంతోపాటు ఎమ్మెల్సీ పీఏ గోపీకృష్ణను కాన్ఫరెన్స్ లో కలిపారు. ఆ కాన్ఫరెన్స్ లో గోపీకృష్ణ ఏం వరుణ్ అని అడగ్గా.. అదే అన్నా ఏదో ఒకటి చేసేస్తాం అని చెబుతారు. వచ్చి నన్ను కలవండి.. ఏమీ చేయొద్దు అని గోపీకృష్ణ చెబుతారు. తాజాగా ఈ ఆడియో కలకలం సృష్టిస్తోంది.

English summary
The plan of the accused to kill a dissident leader of the YSR Congress Party has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X