ఏపీ-తెలంగాణలో ఓటు హక్కుపై ఈసీని ఆశ్రయించనున్న వైసీపీ ! ఎన్నికల వేళ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమవుతోంది. రేపు తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో తెలంగాణలో ఏపీ సెటిలర్ల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీలో అధికార వైసీపీ ఓ కీలక అంశంపై ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్న వారిపై చర్యలు కోరుతూ వైసీపీ మంత్రులు, నేతలు ఇవాళ సీఈవో ముకేష్ కుమార్ మీనాను కలవబోతున్నారు.
ఇవాళ ఉదయం 11.30 కి అమరావతిలోని సెక్రటేరియట్ లో మంత్రులు జోగి రమేశ్,మేరుగ నాగార్జున,మండలి విప్ అప్పిరెడ్డి సీఈవోను కలవనున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లు, పలు చోట్ల ఓట్ల తొలగింపు, ఏపీ-తెలంగాణ లో ఓట్లు కలిగిఉండటం పై వైసీపీ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేయనున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. అయితే ఇందులో నకిలీ ఓట్లు, ఓట్ల తొలగింపులపై గతంలోనూ ఫిర్యాదులు చేసినా రెండు రాష్ట్రాల్లో ఓటుపై మాత్రం ఇప్పుడు వైసీపీ చేయబోతున్న ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఓవైపు రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇందులో ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో సెటిలైన కోట్లాది కుటుంబాలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాయి. వీరిలో చాలా మందికి ఏపీలోనూ ఓటు హక్కు ఉంది. అలాగే తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్న అధికార పార్టీ బీఆర్ఎస్ తో వైసీపీకి గట్టి సంబంధాలే ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో వైసీపీకి బద్దవ్యతిరేకిగా ఉన్న చంద్రబాబుకు హైదరాబాద్ లో సెటిలర్ల అండ ఉంది.
ఈ నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు కలిగి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయబోతున్న వారిని అడ్డుకునేందుకే ఈసీకి వైసీపీ ఈ ఫిర్యాదు చేయబోతోందా అన్న చర్చ జరుగుతోంది. అలాగని వైసీపీ ఫిర్యాదు చేసినా వెంటనే తెలంగాణ ఎన్నికల్లో వారిని అడ్డుకునే పరిస్ధితి ఉండదు. కానీ రేపు ఏపీలో జరిగే ఎన్నికల నాటికి ఈ తెలంగాణ సెటిలర్ల ఓట్లు ఇక్కడ తొలగిస్తే మాత్రం వారికి ఇబ్బందులు తప్పవు. దీంతో వైసీపీ ఫిర్యాదు, దానిపై ఈసీ తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications