ICC World Cup 2023: అమితాబ్ కు బీసీసీఐ గోల్డెన్ టికెట్ - స్వయంగా జైషా కలిసి..!!
ఐసీసీ 2023 ప్రపంచ కప్ పండుగకు సమయం సమీపిస్తోంది. ఉపఖండంలో జరిగే క్రికెట్ సమరానికి జట్లు..ఆటగాళ్లతో కోట్లాది మంది అభిమానులు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో బీసీసీఐ వరుస నిర్ణయా లతో ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెంచుతోంది. క్రికెట్ అంటే సినీ స్టార్స్ కు అభిమానం పీక్ లో కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆటగాళ్లు..సినీస్టార్స్ ఒకే గ్రౌండ్ లో ఉంటే ఆ మజానే వేరు. ఇప్పుడు తాజాగా ఆ దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్:ప్రపంచ కప్ క్రికెట్ సమరానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అన్ని మ్యాచ్ లు ఎలా ఉన్నా..అక్టోబర్ 14న జరిగే దాయాది సమరానికి ఉన్న ప్రత్యేకతే వేరు. టికెట్ల ధర ఎంత అయినా పర్వాలేదు అన్నట్లుగా విక్రయాలు జరిగాయి. ఇక, ఇప్పుడు ఈ సారి ప్రపంచ కప్ సమరం వేళ బీసీసీఐ ప్రత్యేక నిర్ణయాలు అమలు చేస్తోంది. లెజెండరీ క్రికెటర్లతో పాటుగా సినీ సెలబ్రటీలను ప్రపంచ కప్ కు ఆహ్వానిస్తూ మరింత ఆసక్తిని పెంచుతోంది. అందులో భాగంగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా కలిసారు.

అమితాబ్ ను కలిసిన జైషా:క్రికెట్ కు అమితాబ్ బచ్చన్ వీరాభిమాని. 2011 లో భారత్ క్రికెట్ కప్ గెలిచిన సమయంలో బిగ్ బీ తన ఫ్యామిలీ తో చేసిన సందడి ఫ్యాన్స్ కు గుర్తుండిపోతుంది. బిగ్ బీ టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్ ను తప్పకుండా ఫాలో అవుతారు. భారత్ క్రికెట్ కు ప్రతీ సందర్భంలోనూ అమితాబ్ అండగా నిలిచారు.
తన మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి ప్రపంచకప్ వేళ బీసీసీఐ కార్యదర్శి జైషా నేరుగా అమితాబ్ నివాసానికి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. బీసీసీఐ తరపున ప్రత్యేకంగా గౌరవించారు. బీసీసీఐ నుంచి వరల్డ్ కప్-2023 గోల్డెన్ టికెట్ అందచేసారు. దీని పైన బీసీసీఐ అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
Golden ticket for our golden icons!
— BCCI (@BCCI) September 5, 2023
BCCI Honorary Secretary @JayShah had the privilege of presenting our golden ticket to none other than the "Superstar of the Millennium," Shri @SrBachchan.
A legendary actor and a devoted cricket enthusiast, Shri Bachchan's unwavering support… pic.twitter.com/CKqKTsQG2F
అమితాబ్ కు గోల్డెన్ టికెట్:"మన గోల్డెన్ ఐకాన్ కు గోల్డెన్ టికెట్ ఇస్తున్నాం. ఈ శతాబ్దపు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు గోల్డెన్ టికెట్ అందించే భాగ్యాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా దక్కించుకున్నారు. లెజెండరీ నటుడు, క్రికెట్ కు వీరాభిమాని అయిన అమితాబ్ బచ్చన్ టీమిండియాకు అందించే అచంచల మద్దతు ఇకపైనా స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తున్నాం.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023లో అమితాబ్ కూడా పాలుపంచుకుంటుండడం పట్ల ఉద్విగ్నతకు లోనవుతున్నాం" అంటూ బీసీసీఐ పేర్కింది. ఈ గోల్డెన్ టికెట్ ద్వారా అందుకు ప్రముఖులు ప్రపంచ కప్ లో ఏ మ్యాచ్ అయినా వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించే అవకాశం దక్కుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ అటు సినీ..ఇటు క్రికెట్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications