24 గంటల్లో వన్ బై థర్డ్ మరణాలు: కర్ణాటకలో కరోనా మరణ మృదంగం..
కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులే కాదు మరణాలు కూడా ఎక్కువే నమోదవుతున్నాయి. ఈ నెలలో 56 శాతం మరణాలు రికార్డవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వీరిలో వన్ బై థర్డ్ ఆస్పత్రిలో చేరిన మరునాడే చనిపోయారు. 4.5 శాతం మంది చికిత్స తీసుకోకుండానే మృతిచెందారు. వీరు ఇంటి వద్ద నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చేలోపు చనిపోయారని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
ప్రో ఆక్టివ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముందస్తుగా వైరస్ గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకోవడం వల్ల 2 శాతం లోపు మరణాలు తగ్గేందుకు దోహద పడింది. అయితే వైరస్ సోకిన తర్వాత వెంటనే గుర్తిస్తే మేలు అని.. లేదంటే వైరస్ ఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతుందని వీసీ డాక్టర్ సచ్చిదానంద్ తెలిపారు.

Recommended Video
ఆగస్ట్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కర్ణాటకలో 2 వేల 656 మరణాలు సంభవించాయి. మంగళవారం నాటికి 950 మంది ఆస్పత్రిలో చనిపోయారని అధికారులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన రోజు, అడ్మిషన్ తీసుకున్న రోజు, మరుసటి రోజు లెక్కల ఆధారంగా మరణించిన వారి లెక్కలను తీసుకున్నామని చెప్పారు. 16వ తేదీన 124 మంది ఆస్పత్రిలో చనిపోయారనే సమాచారం మాత్రం లేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఒక రోజులో 30 నుంచి 40 శాతం మంది వరకు చనిపోయారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications