గృహలక్ష్మి పథకం ప్రారంభం, మహిళల బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్, సోనియా ఎంట్రీ!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ హామీ పథకాల్లో ఒకటైన గృహలక్ష్మి పథకం ఎట్టకేలకు అమలులోకి వస్తోంది. గృహ లక్ష్మి పథకం కింద ఇంటి పెద్ద అయిన మహికు ప్రతి నెలా రూ. 2, 000 ఇవ్వడానికి రంగం సిద్దం అయ్యింది. జులై 16వ తేదీన ఈ పథకం ప్రారంభించాని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దానిని ప్రసారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే శక్తి పథకం, అన్న భాగ్య పథకాలను కర్ణాటక ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు కర్ణాటక మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గృహలక్ష్మి పథకం కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈనెల 16వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు బెంగళూరులో ప్రతిపక్ష నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. గృహలక్ష్మి పథకాన్ని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించాని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.
గృహలక్ష్మి పథకం అమలు విషయంలో ఎలాంటి గందరగోళం లేదని కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నారు. కేవలం ఆధార్ లింక్ ఉన్న ఖాతాలో మాత్రమే డబ్బు జమ చేయాలా లేక ఆధార్ లింక్ లేని ఖాతాలో కూడా డబ్బు జమ చేయాలా అనే గందరగోళం మాత్రమే ఉందని అన్నారు. డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయని, లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధంగా ఉందని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ చెప్పారు.

అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలో ఆగస్టు నెల నుంచి రెండు వేల రూపాయలు జమ చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, సుస్థిర ప్రభుత్వం మా లక్ష్యమని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న ప్రకారం జులై 18న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుంతుందని మంత్రి అన్నారు.
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి నెల రోజుల్లో అందరి ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తుందని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నారు. గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. గృహ లక్ష్మి కోసం ప్రత్యేక యాప్ను కర్ణాటక ప్రభుత్వం సిద్ధం చేసింది.

అలాగే బాపూజీ సేవా కేంద్రం, నాడకచేరి, తాలూకా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గృహ లక్ష్మి యోజన కోసం సమర్పించాల్సిన దరఖాస్తు ఫారమ్ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఈ దరఖాస్తు ఫారమ్ను విడుదల చేసింది. ఇందులో ఇంటి యజమాని ఎవరు, ఆధార్ కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు పలు సమాచారాన్ని అందించాలని అధికారులు సూచించారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications