భార్యకు ఎప్పుడంటే అప్పుడు మెసేజ్ లు, ఫ్రెండ్ ను భర్త ఏం చేశాడంటే, రాత్రిపూట!
బెంగళూరు/మైసూరు: ఓ యువకుడు వివాహం చేసుకుని అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. దంపతులు నివాసం ఉంటున్న ఊరిలోనే భర్తకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. భర్త స్నేహితుడు అతని భార్యకు అసభ్యంగా మెసేజ్ చేశాడు. తన భార్యకు ఫ్రెండ్ మెసేజ్ చేశాడని తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. భార్యకు మెసేజ్ చేసిన స్నేహితుడిని భర్త చంపేశాడు.
గృహిణికి మెసేజ్ పంపినందుకు యువకుడిని హత్య చేసిన కేసు ఊహించని మలుపు తిరిగింది. మరొకరిపై ద్వేషం పెంచుకున్న కిరాతకుడు అతని స్నేహితుడిని చంపాలని ప్లాన్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హెచ్డీ కోటే తాలూకా నీలేహుండి గ్రామంలో భానుప్రకాష్ అనే యువకుడు అతని భార్యకు సందేశం (మెసేజ్) పంపాడనే కారణంతో హత్య చేశాడు.

యువకుడి హత్యకు సంబంధించి పెద్ద గొడవ చేసిన ఆరుగురు యువకులను మైసూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భానుప్రకాష్ని అతని స్నేహితుడు దినేష్ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దినేష్ అతని స్నేహితుడు భీమాతో కలిసి భానుప్రకాష్ను గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.
భానుప్రకాష్ మృతదేహాన్ని గ్రామంలోని బయటి మండలంలోని కబినీ నదిలో పడేశారు. అదే గ్రామానికి చెందిన ఎన్. ప్రకాష్ ఈ హత్య చేశాడని దినేష్ అందరిని నమ్మించడానికి ప్రయత్నించాడని పోలీసులు అన్నారు. ఎట్టకేలకు మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా హత్య చేసిన నిందితులు దినేష్, భీమాలను పోలీసులు గుర్తించారు.
హత్యకు పాల్పడిన దినేష్ అదే గ్రామంలో నివాసం ఉంటున్న ప్రకాష్ మధ్య పాత శత్రుత్వం ఉందని, ప్రకాష్ మీద పగ తీర్చుకోవాలని చాలా కాలంగా దినేష్ ఎదురు చూస్తున్నాడని పోలీసులు అన్నారు. ఇదే కారణంగా తన సన్నిహితుడు భానుప్రకాష్ ను దారుణంగా హత్య చేసి ఆ కేసును ప్రకాష్ మీద వెయ్యడానికి దినేష్ ప్రయత్నించాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications