40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!
సాధారణంగా యుద్ధం వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన 'బంగారం' వైపు పరుగులు తీస్తారు. కానీ, ప్రస్తుతం ఇరాన్తో సాగుతున్న యుద్ధం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, పసిడి ధరలు ఊహించని విధంగా పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఒక్క వారంలోనే బంగారం 11 శాతం మేర క్షీణించి, 1983 తర్వాత అత్యంత దారుణమైన వారపు నష్టాన్ని మూటగట్టుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుండి చూస్తే పసిడి ఏకంగా 14 శాతం విలువను కోల్పోవడం గమనార్హం.
సంక్షోభ సమయాల్లో బంగారం విలువ పెరుగుతుందనేది దశాబ్దాల కాలంగా వస్తున్న నమ్మకం. అయితే, ఈసారి 'డాలర్' పునరుత్థానం పసిడి ఆశలపై నీళ్లు చల్లింది. ఇరాన్ యుద్ధం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో, ప్రపంచ కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనను విరమించుకున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో బాండ్ ఈల్డ్లు పెరిగాయి. ఎటువంటి అదనపు ఆదాయం ఇవ్వని బంగారం కంటే, వడ్డీనిచ్చే బాండ్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపడం పసిడి పతనానికి ప్రధాన కారణమైంది.

డాలర్ దూకుడు.. పసిడికి చేటు!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. యుద్ధం నేపథ్యంలో అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తిగా డాలర్ను ఎంచుకున్నారు. దీంతో డాలర్ ఇండెక్స్ గత కొన్ని నెలల పతనాన్ని ఆపి, 2 శాతం పైగా పుంజుకుంది. డాలర్ బలపడటంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు బంగారం మరింత ఖరీదైనదిగా మారింది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు కిందికి దిగివచ్చాయి. గత జనవరిలో రికార్డు స్థాయిలో ట్రాయ్ ఔన్స్కు 5,000 డాలర్ల మార్కును తాకిన పసిడి, ఇప్పుడు 4,500 డాలర్ల దిగువకు పడిపోయి రెండేళ్ల లాభాలను ఆవిరి చేసింది.
ఇన్వెస్టర్ల వ్యూహం మారింది!
ఒకప్పుడు కేవలం సంక్షోభ నిధిగా ఉన్న బంగారం, గత కొన్ని వారాలుగా ఒక 'మీమ్ స్టాక్'లా అస్థిరంగా మారుతోంది. ఇతర ఆస్తులలో (స్టాక్ మార్కెట్ వంటివి) వస్తున్న నష్టాలను పూడ్చుకోవడానికి (Cash out) చాలామంది ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారని ఆర్థిక వ్యూహకర్తలు విశ్లేషిస్తున్నారు. అప్ వార్డ్ మొమెంటం మందగించడంతో పోర్ట్ఫోలియోలను రీ-బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
బంగారం ధరలు ప్రస్తుతం పడిపోయినప్పటికీ, భవిష్యత్తుపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే, ఏడాది చివరి నాటికి పసిడి మళ్లీ పుంజుకుని 6,000 డాలర్ల మార్కును చేరుకోవచ్చని వాల్ స్ట్రీట్ దిగ్గజం ఎడ్ యార్డెనీ అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికా ప్రభుత్వం అప్పులు మరియు ద్రవ్యోల్బణ పరిస్థితులు అనుకూలించకపోతే ఈ లక్ష్యాన్ని 5,000 డాలర్లకు తగ్గించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతానికైతే పసిడి వెలుగులు యుద్ధ నీడలో మసకబారాయి.
-
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
ఉగాది రోజు బంగారం కొంటే ఐశ్వర్యమే! తగ్గిన ధరలతో రెట్టింపు లాభం! -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
ఇరాన్ ఆర్మీ జనరల్ మృతి- కూలిన మరో మూలస్తంభం -
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
ఖురాన్ శాంతి సందేశం.. రంజాన్ పవిత్రతకు యుద్ధ పరీక్ష -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!














Click it and Unblock the Notifications