Sasikala: చిన్నమ్మకు సినిమా కష్టాలు, దెబ్బతో సీన్ ఫుల్ రివర్స్, కోర్టుకు ఫ్యామిలీ, కథ వేరేగా ఉంది!
బెంగళూరు/ చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే. శశికళ నటరాజ్ కు మెరుగైన చికిత్స అందించడానికి ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి కోర్టును ఆశ్రయించాలని చిన్నమ్మ కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వీకే. శశికళ ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో బెంగళూరులోని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పోందుతున్నారు. బౌరింగ్ ఆసుపత్రి నుంచి వీకే. శశికళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి అనుమతి కోసం ఆమె కుటుంబ సభ్యులు నేడు (శుక్రవారం) కోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఐదు రోజుల్లో జైలు నుంచి విడుదల కావాల్సిన నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి చిన్నమ్మ అంటూ ఆమె అభిమానులు విచారంలో మునిగిపోయారు.

జైలు నుంచి బౌరింగ్ వరకు చిన్నమ్మ
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ ఇదే నెల 27వ తేదీ బుధవారం జైలు నుంచి విడుదల కావలసి ఉంది. ఇదే సమయంలో శశికళ అనారోగ్యానికి గురి కావడంతో ఆమెకు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. మొదట జ్వరం అని వెలుగు చూసినా సీటీ స్కానింగ్ లో శశికళకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆమెను బెంగళూరులోని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రిలోకి కరోనా వార్డుకు తరలించారు.

హెల్త్ బులెటిన్ తో బేజారు
శుక్రవారం ఉదయం బౌరింగ్ ఆసుపత్రి వర్గాలు వీకే. శశికళ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శశికళకు కరోనా వైరస్ తో బాధపడుతున్నారని, ఆమెకు నిరంతరం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శశికళ ఆరోగ్యంపై ఆమె కుటుంబ సభ్యులతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (MMMK) పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కోర్టుకు చిన్నమ్మ ఫ్యామిలీ
అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వీకే. శశికళ ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో బెంగళూరులోని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పోందుతున్నారు. బౌరింగ్ ఆసుపత్రి నుంచి వీకే. శశికళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి అనుమతి కోసం ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యారు. శశికళకు ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించి ఆమె కోలుకునేలా చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

బెంగళూరు టూ చెన్నైకి భారీ ర్యాలీ
జనవరి 27వ తేదీన శశికళ జైలు నుంచి విడుదలై ఉంటే ఆ కథ వేరుగా ఉండేది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ నుంచి నేరుగా హోసూరు మీదుగా చెన్నై వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ వర్గాలు నిర్ణయించాయి. హోసూరు నుంచి చెన్నై వరకు ఇప్పటికే శశికళ ఫెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యడంలో టీటీవీ. దినకరన్ వర్గీయులు బిజీ అయ్యారు. అయితే సీన్ రివర్స్ కావడంతో శశికళ వర్గీయులు ఆయోమయంలో పడిపోయారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications