కలికాలంలో కన్యాశుల్కం ..10ఏళ్లు కూడా నిండని చిన్నారికి 50ఏళ్ల వాడితో పెళ్లి
కలికాలంలో కన్యాశుల్కం ఇచ్చి బాల్య వివాహం చేసుకునేందుకు యత్నం చేసిన ఘటన అందర్నీ ఆలోచింపజేస్తుంది . ఒకప్పుడు బాల్య వివాహాలు చెయ్యటం , కన్యా శుల్కం తీసుకుని చిన్న పిల్లలని ముసలి వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయటం వంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో కూడా అలాంటి దురాచారాలు ఇంకా కొనసాగుతున్నాయి అంటే నమ్ముతారా ? అలాంటి ఘటనే శ్రీకాళహస్తి లో చోటు చేసుకుంది.

డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి యత్నం
ఆడపిల్లలను భారంగా భావించకూడదని , ఆడపిల్లలకు స్వేచ్చా స్వాతంత్రాలు ఇవ్వాలని, మగవాళ్ళతో సమానంగా పెంచాలని , ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ, ప్రజల్లో చైతన్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడపిల్లల మీద చులకన భావం మారటం లేదు . డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి చేసేందుకు సిద్ధమయిన తల్లిదండ్రులు ఆమెను 50ఏళ్ళ వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ప్రయత్నం చేశారు .

కన్యాశుల్కం ఇచ్చి 10ఏళ్ళ చిన్నారిని పెళ్లి చేసుకోబోయిన 50ఏళ్ల వ్యక్తి
విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈ బాల్య వివాహాన్ని ఆపి బాలికను కాపాడారు . చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమనాడులో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే పదేళ్లు కూడా నిండని ఓ చిన్నారికి కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. 50ఏళ్ల మాధవాచారి అనే వ్యక్తికి ఆ చిన్నారిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . ఇక ఆ బాలికను వివాహం చేసుకునేందుకు మాధవాచారి ఆమె తల్లిదండ్రులకు ఎదురు కట్నం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు .. కేసు నమోదు
ఈ విషయం గ్రామస్తులకు తెలియటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వివాహం ఆపి చిన్నారిని ఆ పెళ్లి నుండి కాపాడి బాలసదన్కు తరలించారు. చిన్నారి తల్లిదండ్రులను, మాధవాచారి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు . ఈ తరహా ఘటనలు నేటి రోజుల్లోనూ చోటు చేసుకోవటం అందరినీ విస్తుపోయేలా చేస్తుంది . ఒకపక్క కేంద్ర సర్కార్ బేటీ బచావో .. బేటీ పడావో నినాదంతో ముందుకు వెళ్తుంటే ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహం చెయ్యటం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక అన్నిటికంటే కన్యాశుల్కం తరహా ఘటన వెలుగులోకి రావటం నిజంగా షాకింగ్ అనిపిస్తుంది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications