Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుకే దిక్కులేదు...ఇచ్చే పనైతేనే ఈ రూట్ లో రా!:చెక్ పోస్ట్ కలెక్షన్ ఏజంట్ వీరంగం

చిత్తూరు:మామూళ్ల మత్తులో జోగుతున్న ప్రభుత్వ శాఖల్లో కాసులు దండిగా గలగలలాడతుండటంతో అవినీతి ఉద్యోగులకు కన్నూమిన్నూగానడం లేదనడానికి ఇదే ఉదాహరణ. రవాణా శాఖలోని ఒక అనధికార ఉద్యోగి ఏకంగా సిఎం చంద్రబాబునే...'వాడికే దిక్కులేదు' అని తూలనాడటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

అది కూడా సిఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పైగా ఒక లారీ డ్రైవర్ నుంచి మామూళ్లు వసూళ్లు చేసుకునే సందర్భంలో ఆ రవాణా శాఖ కలెక్షన్ ఏజంట్ ముఖ్యమంత్రిని ఈ విధంగా దూషించగా...ఈ ఉద్యోగి తీరుతెన్నులు గమనించిన ఆ లారీడ్రైవరే ఇతగాడి వ్యవహారాన్ని వీడియో తీసి రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంలకు పంపించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఇక్కడి భాగోతమంతా బైటపడింది. వివరాల్లోకి వెళితే...

Corruption peaks in Transport department...Corrupted employees abusing even Chief Minister for Bribes!

తమిళనాడుకు జిప్సం లోడుతో వెళుతున్న ఓ లారీ చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు మీదుగా ప్రయాణించాల్సివుంది. ఈ క్రమంలో ఆ చెక్‌పోస్టులోని రవాణా సిబ్బంది ఈ లారీని ఆపారు. అయితే వారడిగిన వివరాలు తెలిపిన లారీడ్రైవర్ తాను సరైన టన్నేజీతోనే లారీ తీసుకెళ్తున్నానని వారితో చెప్పాడు. అయితే అందుకు స్పందించిన అక్కడి కలెక్షన్ ఏజంట్ అయినా సరే నువ్వు మామూలు ఇచ్చి వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేశాడు.

దీంతో ఆ లారీడ్రైవర్ ఆ ఉద్యోగిని బ్రతిమలాడుతూ...నేను ఎప్పుడూ ఈ రూట్ లోనే తిరుగుతూ ఉంటా...నేను కూడా ఆంధ్రావాడినే...వదిలేయండి అన్నా అంటూ బ్రతిమలాడాడు. దీంతో రెచ్చిపోయిన సదరు కలెక్షన్ ఏజంట్...''ఇక్కడ చంద్రబాబుకే దిక్కులేదు. ఆంధ్రా గీంద్రా అని మాట్లాడొద్దు...సరే ఈ సారికి పంపిస్తా...కానీ డబ్బులు ఇచ్చే పనైతేనే ఈ రూట్‌లో రా...లేదంటే అసలు ఇటు రావద్దు'' అని తేల్చి చెప్పేశాడు. దీనితో అతడి వైఖరిపై కోపం వచ్చిన లారీడ్రైవరు కలెక్షన్ ఏజంట్ తో...'అంతమాటన్నావేంటన్నా...అయితే చంద్రబాబుకే దిక్కు లేదంటారా?'...అని రెట్టించాడు.

దీంతో మరింతగా రెచ్చిపోయిన ఆ ఉద్యోగి ఈసారి సిఎం పేరును చంద్రబాబు అని కూడా ఉచ్చరించకపోగా...ఏకంగా 'అవును...వాడికే దిక్కులేదు' అంటూ పొగరుగా సమాధానమిచ్చాడని తెలిసింది. ఆ ఉద్యోగి వాలకాన్ని గమనించి ముందే సెల్ రికార్డ్ ఆన్ చేసి ఉంచుకున్న ఆ లారీ డ్రైవర్... బుధవారం జరిగిన ఈ ఘటన గురించి రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, రవాణా కమిషనర్‌ బాలసుబ్రమణ్యంలకు ఫిర్యాదు చేస్తూ ఈ వీడియోను పంపించాడు. అయితే ఇతడు ఇంతగా రెచ్చిపోయి సిఎంనే దూషిస్తున్నా అక్కడే పక్కనే ఉన్న రవాణా శాఖ అధికారి గాని, సిబ్బంది గాని వారించే ప్రయత్నం చేయలేదని కూడా తెలిపాడు.

దీంతో ఈ ఉదంతంపై సీరియస్‌ అయిన మంత్రి, కమిషనర్‌ వెంటనే డీటీసీ ప్రతాప్‌కు ఫోన్ చేసి ఘటన గురించి చెప్పి సీఎంనే దూషిసున్నా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటన గురించి డీటీసీ ప్రతాప్‌ గురువారం చిత్తూరు డీఎస్పీ సుబ్బారావుకు ఫిర్యాదు చేయడంతో పాటు అప్పుడు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్‌ ఎంవీఐ రవిశంకర్‌ నాయక్‌కు మెమో ఇచ్చారని తెలిసింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరపగా ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది.

సీఎంని దూషించిన వ్యక్తి అసలు రవాణా శాఖ ఉద్యోగే కాదని...కేవలం చెక్‌పోస్టులోని సిబ్బంది మామూళ్ళ వసూళ్ళ కోసమే నియమించుకున్న ప్రైవేటు వ్యక్తి అని వెల్లడయిందని అంటున్నారు. అంతేకాదు ఈ నెల 13వ తేదీన ఏసీబీ అధికారులు ఈ చెక్‌పోస్టుపై దాడి చేయగా ఆ సమయంలో ఈ ఘటనలో తాజాగా సస్పెండైన ఇదే అసిస్టెంట్‌ ఎంవీఐ రవిశంకర్‌ నాయక్‌ అప్పుడూ డ్యూటీలో వున్నారని తెలిసింది. ఆ రోజు ఆయన డ్యూటీలోకి ఎక్కిన 4 గంటల వ్యవధిలోనే అక్కడ రూ.41 వేలు అనధికారిక నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి కనీసం 10 రోజులైనా గడవకముందే అక్కడి ఉద్యోగులు ప్రత్యేకంగా ఒక ప్రైవేటు కలెక్షన్‌ ఏజెంటును కూర్చోబెట్టి మరీ మామూళ్ళు వసూళ్ళు చేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+