నేడే గణేషుడిని కొలిచే బాలచంద్ర సంకష్ట చతుర్థి
నేడు బాలచంద్ర సంకష్టి చతుర్థి. గణపతికి అంకితం చేసిన ఈ పవిత్ర దినాన భక్తులు ఉపవాసం ఆచరిస్తారు. విఘ్ననాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. జీవితంలోని అడ్డంకులను తొలగించి, శ్రేయస్సు పొందడానికి గణపతి ఆశీస్సులు కోరుకోవడం ఈ వ్రత ఉద్దేశం. చంద్రోదయం తర్వాత సాయంత్రం ఆచారాలు పూర్తయ్యాక ఉపవాసం విరమించడం ఆనవాయితీగా వస్తోంది.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి చంద్రమాసంలో రెండు చతుర్థి తిథులుంటాయి. పౌర్ణమి తర్వాత కృష్ణ పక్షంలో సంకష్టి, అమావాస్య తర్వాత శుక్ల పక్షంలో వినాయక చతుర్థి. ఫాల్గుణ మాసంలోని సంకష్టి చతుర్థిని 'బాలచంద్ర సంకష్టి' గా జరుపుకొంటారు. ఈ రోజున చంద్రవంకను నుదుట ధరించిన బాలచంద్ర గణపతి రూపాన్ని భక్తులు ఆరాధిస్తారు. శివుడిని బాలచంద్రుడు అని పిలవడం మనకు తెలిసిందే.

బాలచంద్ర సంకష్టి చతుర్థి 2026కు సంబంధించిన ముఖ్య సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్థి తిథి ఈ సాయంత్రం 5:53 నిమిషాలకు ప్రారంభమై, 7వ తేదీ సాయంత్రం 7:17 నిమిషాలకు ముగుస్తుంది. సంకష్టి రోజున రాత్రి 9:14 గంటలకు చంద్రోదయం ఉంటుంది. చంద్ర దర్శనం, చంద్రదేవుడికి పూజల తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు.
ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. భక్తులు సూర్యోదయం నుండి ఉపవాసం ప్రారంభించాలి. ఉదయం పవిత్ర స్నానం ఆచరించి, గణపతిని ధ్యానిస్తూ వ్రతం పాటించడానికి సంకల్పం తీసుకోవాలి. చాలామంది మౌనాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారీ రోజున. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి, పూజాదికాలను నిర్వహించాలి. పీఠంపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి, షోడశోపచార పూజతో ఆరాధించాలి. గణపతికి ప్రీతికరమైన మోదకాలు, తమలపాకులు, దూర్వా గడ్డి, ఎర్రటి పూలు వంటి వస్తువులను సమర్పించాలి.
చంద్రోదయం సమయంలో భక్తులు నీరు, పువ్వులు, ప్రార్థనలతో అర్ఘ్యం సమర్పించాలి. ఈ ఆచారాలు ముగిసిన తర్వాత భక్తులు తమ ఉపవాసాన్ని విరమించాలి. సాత్వికాహారాన్ని తీసుకోవాలి. కఠిన ఉపవాసం పాటించలేని వారు పండ్లు లేదా తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. వ్రతంలో నూనె, భారీ ఆహారం నివారించడం సంప్రదాయం.
బాలచంద్ర సంకష్టి చతుర్థికి హిందూ సంప్రదాయాలలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. గణపతిని అడ్డంకులను తొలగించే దేవతగా, జ్ఞానం, విజయం, శ్రేయస్సు ప్రసాదించే వాడిగా కొలుస్తారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించడం ద్వారా జీవిత సమస్యలు పరిష్కారమై, శాంతి, స్థిరత్వంతో పాటు సంతోషం, విజయం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా నాలుగు లేదా 13 సంవత్సరాలు ఆచరించడం వల్ల దీర్ఘకాలిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కాలం పూర్తయిన తర్వాత 'ఉద్యాపన' అనే ముగింపు ఆచారాన్ని నిర్వహిస్తారు. ఇది వ్రత దీక్ష విజయవంతమైన ముగింపును, సంకల్పానికి ప్రతీకను సూచిస్తుంది.
-
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
భారత్ కు ఇరాన్ బిగ్ రిలీఫ్-హార్ముజ్ జలసంధిపై కీలక ప్రకటన..! -
యుద్ధం వేళ.. భారత్ కు రష్యా భారీ సాయం..! షాక్ లో ట్రంప్..! -
రోజూ చపాతీలు తింటున్నారా - ఈ జాగ్రత్తలు అవసరం, లేదంటే..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..!












Click it and Unblock the Notifications