రాజపక్సేపై మోడీ ఒత్తిడి..? అదానీకి మేలు, అందుకే తెరపైకి అగ్నిపథ్: కేటీఆర్
అగ్నిపథ్ పథకంపై నిరసన జ్వాలలు కొనసాగాయి. విద్యార్థులు, నిరుద్యోగ యువత కదం తొక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ పథకం ప్రవేశపెట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కీలకమైన సమస్య పక్కదారి పట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా చేశారా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అందుకే ఇలా...
శ్రీలంకలో
భారత
ప్రధాని
నరేంద్ర
మోడీ-
ప్రముఖ
వ్యాపారవేత్త
గౌతమ్
అదానీ
అవినీతి
బంధంపై
ఆరోపణలు
వస్తోన్నాయి.
దాంతో
మంత్రి
కేటీఆర్
ట్వీట్
చేశారు.
దేశం
దృష్టిని
మరల్చేందుకే
ఈ
పథకాన్ని
ప్రకటించారా?
అని
కేటీఆర్
కొశ్చన్
చేశారు.
కీలక
అంశాలను
చర్చకు
వచ్చిన
సందర్భంలో
ప్రభుత్వాలు
ఇలా
చేస్తుంటాయనే
అపవాదు
ఉంది.
దానిని
మంత్రి
కేటీఆర్
గుర్తుచేసి..
ఆరోపణలు
చేశారు.
మోడీ ఒత్తిడి..?
శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై ప్రధాని మోడీ ఒత్తిడి తెర్చారట. ఈ మేరకు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఫెర్డినాండో తన కామెంట్లను వెనక్కి తీసుకొన్నారు. అంతేకాదు పదవీకి కూడా రాజీనామా చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్లో విపక్షాలు ప్రధాని మోడీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు.
నోరు మెదపరా..?
ఈ
అంశంపై
ఎందుకు
నోరు
మెదపడం
లేదని
బీజేపీని,
ప్రధాని
మోదీని
కేటీఆర్
గతంలోనూ
ప్రశ్నించారు.
తాజాగా
అగ్నిపథ్
పథకాన్ని
ఈ
వివాదంతో
ముడిపెడుతూ
ట్వీట్
చేశారు.
వారి
ప్రమేయం
వల్లే
ఇలా
జరిగిందా
అని
అడిగారు.
సమస్యను
పక్కదారి
పట్టించేందుకే
ఇలా
చేశారని
ఆరోపించారు.
మరీ
ఈ
కామెంట్స్పై
బీజేపీ
ఎలా
స్పందిస్తుందో
చూడాలీ.
వాట్సాప్ గ్రూపులలో సందేశం
అగ్నిపథ్ పథకం అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కూడా చేసింది. విద్యార్థులు రోడ్డెక్కడానికి కారణం సోషల్ మీడియా అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ గ్రూపులపై నిషేధం విధించింది.అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో సమాచారం అందజేశారు. అలా 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది. వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని పేర్కొంది. దాంతోనే హింసకు దారితీసిందని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇన్ వాల్వ్ అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరాతీసింది.