రాజపక్సేపై మోడీ ఒత్తిడి..? అదానీకి మేలు, అందుకే తెరపైకి అగ్నిపథ్: కేటీఆర్
అగ్నిపథ్ పథకంపై నిరసన జ్వాలలు కొనసాగాయి. విద్యార్థులు, నిరుద్యోగ యువత కదం తొక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ పథకం ప్రవేశపెట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కీలకమైన సమస్య పక్కదారి పట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా చేశారా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అందుకే ఇలా...
శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ- ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై ఆరోపణలు వస్తోన్నాయి. దాంతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని కేటీఆర్ కొశ్చన్ చేశారు. కీలక అంశాలను చర్చకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వాలు ఇలా చేస్తుంటాయనే అపవాదు ఉంది. దానిని మంత్రి కేటీఆర్ గుర్తుచేసి.. ఆరోపణలు చేశారు.

మోడీ ఒత్తిడి..?
శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై ప్రధాని మోడీ ఒత్తిడి తెర్చారట. ఈ మేరకు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఫెర్డినాండో తన కామెంట్లను వెనక్కి తీసుకొన్నారు. అంతేకాదు పదవీకి కూడా రాజీనామా చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్లో విపక్షాలు ప్రధాని మోడీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు.

నోరు మెదపరా..?
ఈ అంశంపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు. వారి ప్రమేయం వల్లే ఇలా జరిగిందా అని అడిగారు. సమస్యను పక్కదారి పట్టించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. మరీ ఈ కామెంట్స్పై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలీ.

వాట్సాప్ గ్రూపులలో సందేశం
అగ్నిపథ్ పథకం అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కూడా చేసింది. విద్యార్థులు రోడ్డెక్కడానికి కారణం సోషల్ మీడియా అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ గ్రూపులపై నిషేధం విధించింది.అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో సమాచారం అందజేశారు. అలా 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది. వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని పేర్కొంది. దాంతోనే హింసకు దారితీసిందని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇన్ వాల్వ్ అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరాతీసింది.
-
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్ను దాటేస్తోందా..? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications