రాజపక్సేపై మోడీ ఒత్తిడి..? అదానీకి మేలు, అందుకే తెరపైకి అగ్నిపథ్: కేటీఆర్
అగ్నిపథ్ పథకంపై నిరసన జ్వాలలు కొనసాగాయి. విద్యార్థులు, నిరుద్యోగ యువత కదం తొక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ పథకం ప్రవేశపెట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కీలకమైన సమస్య పక్కదారి పట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా చేశారా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అందుకే ఇలా...
శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ- ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై ఆరోపణలు వస్తోన్నాయి. దాంతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని కేటీఆర్ కొశ్చన్ చేశారు. కీలక అంశాలను చర్చకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వాలు ఇలా చేస్తుంటాయనే అపవాదు ఉంది. దానిని మంత్రి కేటీఆర్ గుర్తుచేసి.. ఆరోపణలు చేశారు.

మోడీ ఒత్తిడి..?
శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై ప్రధాని మోడీ ఒత్తిడి తెర్చారట. ఈ మేరకు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఫెర్డినాండో తన కామెంట్లను వెనక్కి తీసుకొన్నారు. అంతేకాదు పదవీకి కూడా రాజీనామా చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్లో విపక్షాలు ప్రధాని మోడీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు.

నోరు మెదపరా..?
ఈ అంశంపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు. వారి ప్రమేయం వల్లే ఇలా జరిగిందా అని అడిగారు. సమస్యను పక్కదారి పట్టించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. మరీ ఈ కామెంట్స్పై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలీ.

వాట్సాప్ గ్రూపులలో సందేశం
అగ్నిపథ్ పథకం అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కూడా చేసింది. విద్యార్థులు రోడ్డెక్కడానికి కారణం సోషల్ మీడియా అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ గ్రూపులపై నిషేధం విధించింది.అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో సమాచారం అందజేశారు. అలా 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది. వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని పేర్కొంది. దాంతోనే హింసకు దారితీసిందని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇన్ వాల్వ్ అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరాతీసింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications