థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పై ఊరట...! పాత వాహనాలకు వర్తించదా?
హైదరాబాద్ : కొత్త కారు కొంటే మూడేళ్లు, బైకులు కొంటే ఐదేళ్లు కచ్చితంగా థర్డ్ పార్టీ బీమా తీసుకోవాల్సిందే. సుప్రీంకోర్టు తెరపైకి తెచ్చిన ఈ నిబంధన వాహనదారుల జేబుకు భారంగా మారింది. ఈనేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు పాత వాహనాలకు సైతం మూడేళ్ల పాటు థర్డ్ పార్టీ బలవంతంగా అమలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వీటిపై కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రోడ్డు రవాణా జాతీయ మంత్రిత్వ శాఖ స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు కేవలం కొత్త వాహనాలకే వర్తిస్తాయని స్పష్టం చేస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది.

సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను ప్రస్తావించడమే గాకుండా వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్రాలకు లేఖలు రాశారు కేంద్ర రోడ్డు రవాణా డిప్యూటీ కార్యదర్శి రమణ్ దీప్ చౌదరి. నిర్మాణ రంగ వాహనాలతో పాటు ట్రక్కులు, బస్సులు తదితర వాహనాలకు కొన్ని రాష్ట్రాలు థర్డ్ పార్టీ బీమాను తప్పనిసరి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని.. అయితే అది సరికాదని పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం న్యూ వెహికిల్స్ కు మాత్రమే థర్డ్ పార్టీ బీమాకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని స్పష్టం చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications