థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పై ఊరట...! పాత వాహనాలకు వర్తించదా?
హైదరాబాద్ : కొత్త కారు కొంటే మూడేళ్లు, బైకులు కొంటే ఐదేళ్లు కచ్చితంగా థర్డ్ పార్టీ బీమా తీసుకోవాల్సిందే. సుప్రీంకోర్టు తెరపైకి తెచ్చిన ఈ నిబంధన వాహనదారుల జేబుకు భారంగా మారింది. ఈనేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు పాత వాహనాలకు సైతం మూడేళ్ల పాటు థర్డ్ పార్టీ బలవంతంగా అమలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వీటిపై కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రోడ్డు రవాణా జాతీయ మంత్రిత్వ శాఖ స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు కేవలం కొత్త వాహనాలకే వర్తిస్తాయని స్పష్టం చేస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది.

సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను ప్రస్తావించడమే గాకుండా వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్రాలకు లేఖలు రాశారు కేంద్ర రోడ్డు రవాణా డిప్యూటీ కార్యదర్శి రమణ్ దీప్ చౌదరి. నిర్మాణ రంగ వాహనాలతో పాటు ట్రక్కులు, బస్సులు తదితర వాహనాలకు కొన్ని రాష్ట్రాలు థర్డ్ పార్టీ బీమాను తప్పనిసరి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని.. అయితే అది సరికాదని పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం న్యూ వెహికిల్స్ కు మాత్రమే థర్డ్ పార్టీ బీమాకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని స్పష్టం చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications