పాతబస్తీకి గుడ్న్యూస్: ఎంజీబీఎస్-ఫలక్నుమా మెట్రోపై కేసీఆర్ ఆదేశాలు: కేటీఆర్, ఒవైసీ స్పందన
హైదరాబాద్: పాతబస్తీ ప్రజలకు కేసీఆర్ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. పాతబస్తీ మెట్రో త్వరలోనే పట్టాలెక్కనుంది. ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గం కోసం 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మున్సిపల్ శాఖ, ఎల్అండ్టీ సంస్థకు స్పష్టం చేసినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మెట్రో రైలు తొలి విడత కింద 69.2 కిలోమీటర్లు నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులెత్తేసింది. రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించడంతోపాటు, నిలిచిపోయిన ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తర్ణం 74.7 కిలోమీటర్లకు విస్తరించనుంది.

దాదాపు ఆరేళ్లుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో మజ్లిస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మార్గాన్ని మళ్లించేందుకు(ఎలైన్మెంట్) సర్వే నిర్వహించినా ముందడుడు పడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ ట్వీట్.. పాతబస్తీ మెట్రో ముండుగుపై ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మున్సిపల్ అధికారులతో, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియణ్తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మిగిలిన 5.5 కిలోమీటర్ల మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో పాతబస్తీ ప్రజలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ రీట్వీట్లు చేస్తున్నారు.
Welcome this announcement by @KTRBRS. The people of Hyderabad’s Old City have been waiting for public transport connectivity for a long time. This will definitely help people of Old City & also bring in more tourism. https://t.co/BK3Cr6WwNX
— Asaduddin Owaisi (@asadowaisi) July 10, 2023
మరోవైపు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. కేటీఆర్ ప్రకటనను స్వాగతించారు. హైదరాబాద్లోని పాతబస్తీ ప్రజలు ప్రజా రవాణా కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఓల్డ్ సిటీ ప్రజలకు సహాయం చేస్తుంది, మరింత పర్యాటకాన్ని కూడా తీసుకువస్తుందని అసదుద్దీన్ ఒవైసీ కేటీఆర్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించారు. .
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications