Hyderabad: కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం.. !
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాలను ఎక్సైజ్ చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లో విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి ప్రకటించారు. డిఫెన్స్ సెక్రటరీ ఎ. గిరిధర్ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు సివిల్ ప్రాంతాలను కంటోన్మెంట్ల నుంచి మున్సిపల్ పరిధిలోకి మార్చే విధానాలపై చర్చించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాంతి కుమారి స్పష్టం చేశారు.
కంటోన్మెంట్ బోర్డుల రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. బ్రిటిష్ పాలన విధానాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రాలను కోరింది. అయితే, విధివిధానాలను ఖరారు చేసే బాధ్యత కలిగిన కేంద్ర కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతో ఇంకా పంచుకోలేదని శాంతి కుమారి పేర్కొన్నారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రంతో తెలంగాణ సహకరిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. విలీనంతో పరిపాలనా సామర్థ్యం, స్థానిక అభివృద్ధిని మెరుగుపరచడం పెరుగుతుందన్నారు.

కంటోన్మెంట్ ఉండడంతో హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణ ఇబ్బందిగా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడిన సీఎం రేవంత్ సమస్యను పరిష్కరించారు. మార్చి 7న రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్కు సీఎం భూమి పూజ చేశారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని అప్పుడు సీఎం చెప్పారు.
ఓఆర్ఆర్ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి హైదరాబాద్ను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications