Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Raja Singh: శ్రీరామ నవమి శోభా యాత్రకు సిద్ధమవుతున్న రాజా సింగ్..

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభా యాత్ర నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. గోషామహల్ భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యే టి రాజా సింగ్ హైదరాబాద్‌లో రామనవమి శోభా యాత్రకు నాయకత్వం వహించనున్నారు. ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాజా సింగ్ ప్రకటించారు.హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

మార్చి 30, 2023న జరిగిన శోభ యాత్ర సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. గతంలో ఊరేగింపును పర్యవేక్షించడానికి సుమారు 1,500 మంది పోలీసులను మోహరించారు. సున్నిత ప్రదేశాలలో పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌లో జరిగే రామనవమి శోభా యాత్రకు కూడా అదే తరహాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.

Goshamahal MLA Raja Singh is preparing for Sri Rama Navami Shobha Yatra

ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా రాజాసింగ్‌ను బీజేపీ నియమించింది. హైదరాబాద్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ మాధవి లతను అభ్యర్థిగా ప్రకటించింది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు బీజేపీ మరోసారి పట్టుదలతో కసరత్తు చేస్తోంది.

బీజేపీ తెలంగాణలో గతం కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. 2019లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఇందులో ముగ్గురు సిట్టింగ్ లకు పార్టీ టికెట్ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+