తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నా... గవర్నర్ నర్సింహన్
తెలంగాణ గవర్నర్ నర్సింహన్ తన చివరి మీడీయా సమావేశాన్ని నిర్వహించారు. ఇన్నాళ్లు తానకు సహకరించిన మీడియా మిత్రులతో రాజకీయా పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.తొమ్మిదిన్న ఏళ్లపాటు కొనసాగిన ప్రస్థానంలో ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్న ఆయన కొన్ని అంశాలపై భాదపడ్డాడు. ఈనేపథ్యంలోనే గవర్నర్ ఎప్పుడు గుళ్లు గోపురాలు పట్టుకుని తిరుగుతాడని కొంతమంది ఆరోపణలు చేయడం బాధించాయని ఆయన తెలిపారు.
మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నర్సింహన్ తన బాధ్యతల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నాడు.మీడియా చిట్చాట్లో పాల్గోన్న ఆయన తొమ్మిదిన్నర ఏళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన బాధ్యతలు ఎంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ సహకరించి సమన్వయంతో వ్యవహరించారని తెలిపారు.ఈ నేపథ్యంలో విభజన సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకినని ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టిన తాను ఒక్క బుల్లెట్ ఉపయోగించవద్దని పోలీసులకు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు రాష్ట్రపతి పాలన కూడ విధిస్తారని భావించారని అన్నారు.

అయితే తాను ఎప్పుడు గుళ్లు గోపురాలు పట్టుకుని తిరుగుతాననే ఆరోపణ తనను కొంత బాధించిందని చెప్పిన ఆయన దేవుడితో పాటు పెద్దలు అంటే ఎక్కువ నమ్ముతానని చెప్పారు. ఇక ఎక్కువగా తిరుపతి,యాదగిరి గుట్ట, భద్రాచలం ఆలయాలకే వెళ్లానని చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నో మధుర జ్ఞాపకాలను తీసుకు వెళ్తుతున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications