పిస్తా హౌస్లో బిర్యానీ తింటున్నారా..? మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు
హలీం, బిర్యానీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు పిస్తా హౌస్. హైదరాబాద్కే ఒక బ్రాండ్గా నిలిచిన ఈ రెస్టారెంట్, ఇప్పుడు వినియోగదారులను షాక్కు గురిచేసేలా వార్తల్లో నిలిచింది. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరియు టాస్క్ ఫోర్స్ బృందాలు పిస్తా హౌస్ రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మొత్తం 25 పిస్తా హౌస్ బ్రాంచ్లలో తనిఖీలు చేసి 23 చోట్ల ఆహార నమూనాలను సేకరించారు. తనిఖీలలో వెల్లడైన వివరాలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అనేక చోట్ల వంటగది పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, ఆహార పదార్థాలపై ఎలుకలు, బొద్దింకలు, ఈగలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా, ఆహారాన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి మాంసాహార వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్లలో నాన్ వెజ్ను నిల్వ ఉంచుతున్నట్లు కూడా అధికారులు నిర్ధారించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా, పిస్తా హౌస్ నిర్వాహకులు తమ పద్ధతులను మార్చుకోవడం లేదని స్పష్టమవుతోంది. ఈ షాకింగ్ విషయాలు బయటపడటంతో, ఇకపై పిస్తా హౌస్ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications