రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తోంది: కేటీఆర్ నిప్పులు
గ్రేటర్ ప్రచారం ఊపు మీదుంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య వార్ పీక్ కి చేరుకుంది. హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అంటున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. అదే నిజమైతే ఆరేళ్లుగా ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. రోహింగ్యాలు ఆధార్, ఓటర్ కార్డులు తీసుకుంటుంటే హోం, రక్షణ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని అడిగారు.

గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించేందుకు బీజేపీ ఇలా మాట్లాడటం హైదరాబాద్కే కాదు.. దేశానికీ మంచిది కాదన్నారు. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి టూరిస్టులు వస్తున్నారని బీజేపీ ప్రచార పర్వాన్ని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క టీఆర్ఎ్సను ఎదుర్కొనేందుకు 12 మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ కూడా వస్తారట అని చెప్పారు. ఇక్కడా వ్యాక్సిన్ ఉచితమని ఆయన చెబుతారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్నాడని డొనాల్డ్ ట్రంప్ను కూడా తీసుకొస్తారేమో అని ఎద్దేవా చేశారు.
పన్నుల రూపంలో రాష్ట్ర ప్రజలు రూ.2.72 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం రూ.1.40 లక్షలు తిరిగి ఇచ్చారనే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఎవరొచ్చినా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పి వెళ్లాలని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామిగా ఉన్నందుకు భారతీయులుగా గర్వపడుతున్నామన్నారు. అయితే కేంద్రమే తెలంగాణకు డబ్బులు ఇచ్చిందనే ఫొజులు కొట్టొద్దని, ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు.
కేంద్రం నుంచి హైదరాబాద్కు వచ్చే పెద్దలు వరద సాయంగా రూ.1350 కోట్లు తేవాలన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో జన్ధన్ ఖాతాలు తెరవాలని మోదీ చెప్పారని, ఆయన పంపిన రూ.15లక్షఽలు ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. బల్దియాలో మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications