ఏటీఎం లావాదేవీలు.. ఎస్బీఐ ఆంక్షలు.. ఆ సంఖ్యను మించితే అదనపు ఛార్జీలు..!
హైదరాబాద్ : ఏటీఎం నగదు లావాదేవీలపై ఎస్బీఐ ఆంక్షలు విధించింది. ఈమేరకు మెట్రో నగరాల్లో ఎస్బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే నగదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. ఇతర ప్రాంతాల్లో ఎస్బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా 5 సార్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఫ్రీ గా డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ ట్రాన్సక్షన్స్ ఈ సంఖ్యను మించిపోతే ఒక్కో అదనపు విత్ డ్రాయల్ కు 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఛార్జీలు వడ్డించనుంది. దీనికి మళ్లీ జీఎస్టీ అదనం. విత్ డ్రాయల్స్ కాకుండా ఇతర లావాదేవీలు (ఫ్రీ అటెంప్ట్స్ కాకుండా) అంటే మినీ స్టేట్మెంట్ లాంటి సేవలు పొందితే 5 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీ చేయనుంది.
అదలావుంటే
సేవింగ్స్
అకౌంట్స్
లో
25వేలు
సగటున
నిల్వ
ఉంచే
ఖాతాదారులకు
అదనపు
ఛార్జీలు
వడ్డించకుండా
ఎస్బీఐ
ఏటీఎం
ల
నుంచి
అన్
లిమిటెడ్
ట్రాన్సక్షన్స్
చేయొచ్చు.
ఇక
లక్ష
రూపాయల
సగటు
నిల్వ
ఉంచే
వారికి
అన్ని
బ్యాంకుల్లో
అన్
లిమిటెడ్
ఏటీఎం
లావాదేవీలు
జరుపుకొనేలా
అవకాశమిచ్చింది.
ఇక
సాలరీ
సేవింగ్స్
అకౌంట్స్
ఉన్నవారికి
బంపర్
ఆఫర్
ప్రకటించింది
ఎస్బీఐ.
ఏ
బ్యాంకులో
నుంచైనా
అన్
లిమిటెడ్
ఏటీఎం
ట్రాన్సక్షన్స్
కు
అనుమతించింది.