ఏటీఎం లావాదేవీలు.. ఎస్బీఐ ఆంక్షలు.. ఆ సంఖ్యను మించితే అదనపు ఛార్జీలు..!
హైదరాబాద్ : ఏటీఎం నగదు లావాదేవీలపై ఎస్బీఐ ఆంక్షలు విధించింది. ఈమేరకు మెట్రో నగరాల్లో ఎస్బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే నగదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. ఇతర ప్రాంతాల్లో ఎస్బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా 5 సార్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఫ్రీ గా డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ ట్రాన్సక్షన్స్ ఈ సంఖ్యను మించిపోతే ఒక్కో అదనపు విత్ డ్రాయల్ కు 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఛార్జీలు వడ్డించనుంది. దీనికి మళ్లీ జీఎస్టీ అదనం. విత్ డ్రాయల్స్ కాకుండా ఇతర లావాదేవీలు (ఫ్రీ అటెంప్ట్స్ కాకుండా) అంటే మినీ స్టేట్మెంట్ లాంటి సేవలు పొందితే 5 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీ చేయనుంది.

అదలావుంటే సేవింగ్స్ అకౌంట్స్ లో 25వేలు సగటున నిల్వ ఉంచే ఖాతాదారులకు అదనపు ఛార్జీలు వడ్డించకుండా ఎస్బీఐ ఏటీఎం ల నుంచి అన్ లిమిటెడ్ ట్రాన్సక్షన్స్ చేయొచ్చు. ఇక లక్ష రూపాయల సగటు నిల్వ ఉంచే వారికి అన్ని బ్యాంకుల్లో అన్ లిమిటెడ్ ఏటీఎం లావాదేవీలు జరుపుకొనేలా అవకాశమిచ్చింది.
ఇక సాలరీ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎస్బీఐ. ఏ బ్యాంకులో నుంచైనా అన్ లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సక్షన్స్ కు అనుమతించింది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications