హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏటీఎం లావాదేవీలు.. ఎస్‌బీఐ ఆంక్షలు.. ఆ సంఖ్యను మించితే అదనపు ఛార్జీలు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఏటీఎం నగదు లావాదేవీలపై ఎస్‌బీఐ ఆంక్షలు విధించింది. ఈమేరకు మెట్రో నగరాల్లో ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే నగదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. ఇతర ప్రాంతాల్లో ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా 5 సార్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఫ్రీ గా డ్రా చేసుకోవచ్చు.

ఒకవేళ ట్రాన్సక్షన్స్ ఈ సంఖ్యను మించిపోతే ఒక్కో అదనపు విత్ డ్రాయల్ కు 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఛార్జీలు వడ్డించనుంది. దీనికి మళ్లీ జీఎస్టీ అదనం. విత్ డ్రాయల్స్ కాకుండా ఇతర లావాదేవీలు (ఫ్రీ అటెంప్ట్స్ కాకుండా) అంటే మినీ స్టేట్‌మెంట్ లాంటి సేవలు పొందితే 5 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీ చేయనుంది.

sbi new rules on atm transactions

అదలావుంటే సేవింగ్స్ అకౌంట్స్ లో 25వేలు సగటున నిల్వ ఉంచే ఖాతాదారులకు అదనపు ఛార్జీలు వడ్డించకుండా ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి అన్ లిమిటెడ్ ట్రాన్సక్షన్స్ చేయొచ్చు. ఇక లక్ష రూపాయల సగటు నిల్వ ఉంచే వారికి అన్ని బ్యాంకుల్లో అన్ లిమిటెడ్ ఏటీఎం లావాదేవీలు జరుపుకొనేలా అవకాశమిచ్చింది.
ఇక సాలరీ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎస్‌బీఐ. ఏ బ్యాంకులో నుంచైనా అన్ లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సక్షన్స్ కు అనుమతించింది.

English summary
SBI Implementing new rules on ATM cash transactions. If the transactions exceed the SBI number, the additional amount will be charged from Rs 5 to Rs 20 per extra. Allowed Salary Savings Accounts to Un Limited ATM transactions from any bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X