వామ్మో.. వీరేం దొంగల్రా నాయనా.. సాప్ట్వేర్ శారద కూరగాయాలు చోరీ, రాత్రికి రాత్రే రూ.5 వేల..
సాప్ట్ వేర్ శారద.. లాక్ డౌన్ వల్ల ఉద్యోగం పోయి, కూరగాయాలు విక్రయిస్తూ కుటుంబం నడుపుతోన్న ధీర వనిత. ఆమె గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ప్రపంచానికి తెలిసింది. దీంతో నటుడు సోనూ సూద్ స్పందించి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఇంతవరకు ఓకే.. కానీ ఆమె కూరగాయలను కేటుగాళ్లు కొట్టేశారు. కుటుంబాన్ని నడిపేందుకు విజిటేబుల్స్ విక్రయిస్తుంటానని.. తన కూరగాయాలు దొంగిలించడంపై ఆమె ఆందోళన చెందుతున్నారు.
సాఫ్ట్వేర్ శారద: కూరగాయలు అమ్ముతోంది, ఆమె ఆత్మస్థైర్యానికి ప్రముఖుల సెల్యూట్
శారద శ్రీనగర్ కాలనీ ఫుట్పాత్పై కూరగాయాలు విక్రయిస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా అమ్మేసి.. ఇంటికెళ్లిపోయారు. కానీ మరునాడు వచ్చి చూస్తే తన కూరగాయాలు లేవు. రోజు లాగానే విజిటేబుల్స్ విక్రయించిన తర్వాత కవర్ కప్పి వెళతానని చెప్పారు. కానీ వచ్చి చూసేసరికి లేవు అని వాపోయింది. వాటి విలువ రూ.5 వేలు అని చెప్పింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూరగాయాలు విక్రయించి.. కుటుంబం గడుపుతున్నామని.. కానీ కూరగాయాలు దొంగిలించడం బాధాకరమని చెప్పారు.
Recommended Video
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ మార్కెట్ కుదేలైపోయింది. సంస్థలు సరైన పని లేకపోవడంతో తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. అలా శారద సాప్ట్ వేర్ ఇంజినీర్ కానీ, ఉద్యోగం కోల్పోయింది. కానీ ఆమె కుంగిపోలేదు... బతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలని అనుకొంది. కూరగాయాలు అమ్ముతూ తన ఇంటిని గడుపుతోంది. ఇంకేముంది కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తోన్న టెకీ అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరలైంది. ఈ విషయం కాస్తా మన హీరో సోనూసూద్ వద్దకు చేరడంతో ఆయన ఉద్యోగం ఆఫర్ చేశారు. కానీ కొందరు కేటుగాళ్లు ఆమె కూరగాయాలను దొంగిలించి.. ప్రపంచ ముదుర్లం అని అనిపించుకున్నారు.