హస్తినబాట: 3 మంత్రుల పయనం.. కేంద్రమంత్రులతో వరస భేటీలు
వరి ధాన్యం కొనుగోలు అంశం దుమారం రేపుతుంది. కొనాలని సీఎం కేసీఆర్ కోరడం.. రా రైస్ కొంటామని కేంద్రం చెప్పడం చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ఎల్పీలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనుకున్న విధంగా మంత్రులు ఢిల్లీ బయల్దేరారు. ఇదే విషయం కేంద్ర పెద్దలకు చెప్పడం.. తర్వాత ఆందోళన చేయడంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగిపోయారు.
యాసంగిలో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులతో కూడిన తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ ఫ్లైటెక్కింది. ఈ బృందంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు.

ఢిల్లీకి చేరుకున్న మరుక్షణమే అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను వీరు కలుస్తారు. ధాన్యం కొనుగోళ్లపై వారితో చర్చిస్తారు. పంజాబ్, హర్యానాల్లో పండిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న కేంద్రం తెలంగాణ ధాన్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న తీరుపై వారు కేంద్ర మంత్రులను నిలదీయనున్నారు. వాస్తవ పరిస్థితులను కేంద్ర మంత్రుల ముందు ఉంచనున్న తెలంగాణ మంత్రులు.. వీలయినంతమేరకు మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఒప్పించే దిశగా తమ వంతు యత్నాలు చేయనున్నారు.
మరోవైపు దేశంలో మార్పు అవసరం.. .కొత్త జాతీయ పార్టీ రావొచ్చు.. తమది బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ కాదు.. ప్రజల మేలుకోరే రాజకీయ ఫ్రంట్ అని కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అన్నారు. అద్భుతంగా కొత్త రాజకీయ పార్టీ రావొచ్చని హింట్ ఇచ్చారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని మరోసారి తెలిపారు. యూపీఏ ప్రభుత్వం కంటే దారుణమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయని వెల్లడించారు. బీజేపీ పరిస్థితి దిగజారిపోతోందని, ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. 75 ఏళ్లలో చాలా సమస్యలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసుగు చెందితే.. బీజేపీకి పట్టం కట్టారన్నారు. 8 బడ్జెట్ను ప్రవేశపెట్టినా దేశంలో ఏమి జరగలేదన్నారు. కరెంటు, నీటిపారుదల, ఆర్థిక అభివృద్ధి.. ఏ రంగం అభివృద్ధి చెందిందా ? అని ప్రశ్నించారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications