కానిస్టేబుల్ ఎగ్జామ్ కీ రిలీజ్.. 31 నుంచి అభ్యంతరాల స్వీకరణ
ఇటీవల కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ప్రాథమిక పరీక్ష కీను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. దీనిని https://www.tslprb.in లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ప్రకటన చేసింది. పరీక్ష ప్రశ్నపత్రంతో కీ ని సరిపోల్చుకోవాలని అభ్యర్థులకు సజెస్ట్ చేసింది.
Recommended Video
పరీక్ష కీ పై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే.. ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వచ్చేనెల 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తెలుపాలని కోరింది. కీ లో.. కొశ్చన్ పేపర్లో అభ్యంతరాలు ఉంటే.. వాటికి సంబంధించిన ఆధారాలను వెబ్సైట్లో అప్ లోడ్ చేయాలని కోరింది. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపింది.
కానిస్టేబుల్ రాత పరీక్ష ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. 15 వేల 644 కానిస్టేబుల్, ఎక్సైజ్ శాఖలో 614, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందుకోసం అభ్యర్థులు దరఖాస్తు చేసి.. రాత పరీక్ష రాశారు. రిటన్ టెస్ట్ ప్రశాంతంగా జరిగింది.
కొలువుల భర్తీపై సీఎం కేసీఆర్ మార్చి నెలలో అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగానే పోలీసు పోస్టులకు రిటన్ టెస్ట్ జరిగింది.