ఫ్లై ఓవర్ పై స్కూల్ బస్సు బోల్తా, గాయాలు
న్యూఢిల్లీ: స్కూల్ బస్సు బోల్తా పడి విద్యార్థులకు తీవ్రగాయాలైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు, ప్రయివేటు స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు.
ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద మంగళవారం ఈ సంఘటన జరిగింది. గాయాలైన విద్యార్థులను వెంటనే సమీపంలోని అరుణా ఆసఫ్ ప్రభుత్వ ఆసుపత్రి, సుశృతా ట్రామా సెంటర్ కు తరలించి చికిత్స చేయించారు. కొందరిని వేరే ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో రుక్మిణి దేవి, విక్టోరియా గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్స్ కు చెందిన బస్సు 30 మంది విద్యార్థులను బస్సులో పిలుచుకుని బయలుదేరారు.
మార్గం మద్యలో ఐఎస్ బీటీ ఫ్లై ఓవర్ మీదుగా వెలుతున్న సమయంలో పాదచారులు అడ్డుగా వెళ్లారు. ఆ సందర్బంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. తీవ్ర గాయాలైన 12 మంది విద్యార్థులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications