కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!
కోయంబత్తూరు: కాలేజ్ విద్యార్థినిపై ఆమె బర్త్ డే రోజు సామూహిక అత్యాచారం చేసిన కేసులో తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు ప్రధాన నిందితుడు మణికందన్ ఫోటోలు విడుదల చేసి అతని కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు కామాంధులను అరెస్టు చేశారు. కాలేజ్ అమ్మాయి స్నేహితుడిని చితకబాది కట్టేసి యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు మొబైల్ లో వీడియోలు తీసి ఆమెను చిత్రహింసలు పెట్టారు. ప్రధాన నిందితుడు మణికందన్ ఫోటోలు విడుదల చేసి అతని కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

బర్త్ డే రోజు స్నేహితులతో !
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సీరనాయకన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్నది. గత నెల నవంబర్ 26వ తేదీన కాలేజ్ అమ్మాయి బర్త్ డే. ఆ రోజు స్నేహితులతో కలిసి సిరినాయకన్ లోని పార్క్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించుకోవడానికి కాలేజ్ విద్యార్థిని ఇంటి నుంచి సంతోషంగా వెళ్లింది.

అందమైన అమ్మాయి కోసం !
బర్త్ డే పార్టీ ముగిసిన తరువాత రాత్రి 9 గంటల సమయంలో కాలేజ్ అమ్మాయి స్నేహితుడితో కలిసి పార్క్ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో ఆరు మంది కామాంధులు కాలేజ్ అమ్మాయి మీద కన్ను వేశారు. పార్క్ లో కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడిని గుట్టుచప్పుడు కాకుండా కామాంధులు ఫాలో అయ్యారు.

ఇంత రాత్రిలో ఏం పని ?
పార్క్ లో ఒక్కసారిగా కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడిని నాలుగువైపుల కామాంధులు చుట్టుముట్టారు. ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత రాత్రి వరకు ఇక్కడ ఉన్నారు అంటూ ఇద్దరితో గొడవ పెట్టుకున్నారు. తరువాత కాలేజ్ అమ్మాయి స్నేహితుడి మీద నిందితులు ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. అమ్మాయి స్నేహితుడు కేకలు వేయకుండా అతని నోరు గట్టిగా మూసిపెట్టారు.

కత్తులతో బెదిరించి !
కాలేజ్ అమ్మాయిని, ఆమె స్నేహితుడిని నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెళ్లారు. తరువాత నీవు పూర్తిగా బట్టలు తీసివేయాలని, లేదంటే నీ స్నేహితుడిని చంపేస్తామని నిందితులు కాలేజ్ అమ్మాయిని బెదిరించారు. బట్టలు విప్పడానికి ఆమె నిరాకరించింది. ఆ సమయంలో స్నేహితుడి మీద మళ్లీ దాడి చేసిన నిందితులు కాలేజ్ అమ్మాయికి కత్తులు చూపించి ఆమెను భయబ్రాంతులకు గురి చేశారు.

కామంతో రెచ్చిపోయి అమ్మాయిని !
యువతిని కత్తులతో బెదిరించి నగ్నంగా చేసిన కామంధులు ఆరు మంది ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి పార్క్ నుంచి బయటకు పంపించకుండా నిందితులు కామవాంఛ తీర్చుకున్నారు. అత్యాచారం చేసే సమయంలో నిందితులు మొబైలో వీడియోలు తీశారు. కేకలు వేస్తే చంపేస్తామని బెదిరించారు. రాత్రి కాలేజ్ అమ్మాయికి చిత్రహింసలు పెట్టిన నిందితులు విషయం బయటకు చెబితే మీ ప్రాణాలు తీస్తామని, మొబైల్ లోని వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి చివరికి వారిని వదిలేశారు.

పక్కాప్లాన్ తో కామాంధులు
కాలేజ్ అమ్మాయి జరిగిన విషయం మొత్తం ఆమె తల్లికి చెప్పింది. కాలేజ్ అమ్మాయి, ఆమె తల్లి ఎస్ఆర్ పుర మహిళా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు. కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కేసులో రాహుల్ (21), ప్రకాష్ (22), కార్తికేయన్ (28), నారాయణమూర్తి (30) అనే నిందితులను శ్రీరాణైచెన్నపాళ్యం సమీపంలో అరెస్టు చేశారు.
కాలేజ్ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు (గ్యాంగ్ లీడర్) కుల్ దీప్ మణికందన్, మరో నిందితుడు పరారైనారని, వీరి ఫోటోలు విడుదల చేసి వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications