మోడీ ఇచ్చిన అతిపెద్ద హామికి.. ఇప్పటికీ ఒక్క పైసా దిక్కు లేదు!
గతేడాది బీహార్ ఎన్నికల సందర్బంగా.. ఆ రాష్ట్రానికి అతిపెద్ద హామి ఇచ్చిన మోడీ దశాల వారిగా నిధులు అందుతాయని ఆ సందర్బంగా ప్రకటించారు. ఇప్పటికైతే ఒక్క పైసా కూడా విడుదల కాలేదని తెలియజేశారు.
ముంబై: గతేడాది బీహార్ ఎన్నికల్లో చతికిలపడ్డ బీజేపీ.. అక్కడ గెలవడానికి మాత్రం శతవిధాలా ప్రయత్నించింది. ఇందుకోసం ప్రధాని మోడీ సైతం రంగంలోకి దిగి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. బీహార్ ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ సందర్బంగా ఓ భారీ వరాన్ని మోడీ ప్రకటించారు.
ఏకంగా రూ.లక్షా 25వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని బీహార్ రాష్ట్రానికి మోడీ ప్రకటించారు. అయితే అప్పటి ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురవడంతో మోడీ సైతం ఈ హామిని మరిచిపోయినట్టున్నారు. ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామికి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి విడుదల కాలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

ముంబైకి చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ అనిల్ గల్గాలి దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన అతిపెద్ద హామి ఏదని, ఆ హామి ఎంతవరకు నెరవేరిందని దరఖాస్తు ద్వారా ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆనందర్ పర్మార్ స్పందించి అనిల్ గల్గాలికి వివరాలు పంపించారు.
గతేడాది బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రాన్ని వెనకబడిన రాష్ట్రంగా గుర్తించి దాని అభివృద్ధి కోసం ఆగస్టు18, 2015న రూ.లక్షా 25వేల 003 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లుగా అనిల్ గల్గాలి తెలిపారు. దశాల వారిగా నిధులు అందుతాయని ఆ సందర్బంగా ప్రధాని హామి ఇవ్వగా.. ఇప్పటికైతే ఒక్క పైసా కూడా విడుదల కాలేదని తెలియజేశారు.












Click it and Unblock the Notifications