వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘోర రోడ్డు ప్రమాదం: 19 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ఈటా సమీపంలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ- ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మరణించారు.
మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
English summary
At least 19 people, including eight children, were killed in Uttar Pradesh's Etah district on Saturday when a speeding truck hit two tractor-trollies full of people, police said.