వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారులు మృతి, 150కిపైగా గుడిసెలు దగ్ధం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 63 సమీపంలో మురికివాడల్లో భారీ మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 150కి పైగా గుడిసెలు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ అగ్ని ప్రమాదంతో బహ్లోల్‌పూర్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుదీర్ఘంగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియోలను పలువురు స్థానికులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 2 Children Dead In Fire In Noida, Nearly 150 Huts Caught In Flames

అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను నోయిడా గౌతమ్ బుద్ధనగర్ పోలీస్ కమిషనర్ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. నోయిడా పోలీస్ స్టేషన్ ఏరియా 3 పరిధిలో బహ్లోల్‌పూర్ గ్రామంలో మంటలు చెలరేగాయి. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి అగ్నిమాపక సిబ్బంది. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

English summary
Several people from Noida took to Twitter to share videos and pictures from the fire. Thick clouds of smoke rising high in the air could be seen from different areas in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X