హుగ్లీలో బాంబు పేలుడు: ఇద్దరికి తీవ్ర గాయాలు
కోల్కత్తా: గురువారం ఉదయం సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బాలాగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్తిపారాలోని మార్కెట్లో ఈ బాంబు పేలుడు ఘటన సంభవించింది.

మార్కెట్లోని ఓ హార్డ్వేర్ షాపు ముందు పెట్టిన పాతబడిన క్యాన్ను పక్కకు పెట్టిన సందర్భంలో ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఎవరైతే షాపుని ఓపెన్ చేసేందుకు వచ్చాడో తపస్ రాజబంగ్షీతో పాటు నితాయ్ దాస్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే బాలాగడ్ ప్రైమరీ ఆసుపత్రికి తరలించారు. ఈ బాంబు పేలుడు ఘటనతో భయభ్రాంతులకు గురైన పలువురు దుకాణం దారులు షాపులు మూసివేశారని, మరికొందరు షాపులు తెరవలేదని పోలీసులు తెలిపారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications