పుణె హైవేపై రోడ్డు ప్రమాదం.. 30 వాహనాలు ధ్వంసం
మహారాష్ట్రలో గల పుణె నావలె బ్రిడ్జీ వద్ద ప్రమాదం జరిగింది. బెంగళూరు- ముంబై హైవే పై ప్రమాదం జరిగింది. అక్కడ స్లోప్ ఎక్కువగా ఉండగా.. కొందరు అదే స్పీడుతో వెళుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రమాదం జరుగుతుందని సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా ఉండటంతో ప్రమాదం తప్పలేదు.
ఒక వాహనం వెనకాల మరొటి ఢీ కొన్నాయి. దీంతో దాదాపు 30 వాహనాలు దెబ్బతిన్నాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. వాహనాలు దెబ్బతిన్నట్టు ఫుటేజీలో కనిపించింది. కొందరు గాయపడి ఉంటారు. కడపటి వార్త అందేవరకు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.
అసలే ఆదివారం.. హాలీ డే మూడ్లో ఉంటారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఒకదాని వెంట మరొకటి ఢీ కొన్నాయి. ఫోటోలలో మాత్రం కార్లు ఘోరంగా దెబ్బతిని కనిపించాయి. కారు ముందుభాగం దాదాపుగా నుజ్జు నుజ్జు అయ్యాయి. అందులో ఉన్నవారు సీటు బెల్ట్ పెట్టుకోవడంతో సేఫ్ అయ్యారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది.