వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుణె హైవేపై రోడ్డు ప్రమాదం.. 30 వాహనాలు ధ్వంసం

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో గల పుణె నావలె బ్రిడ్జీ వద్ద ప్రమాదం జరిగింది. బెంగళూరు- ముంబై హైవే పై ప్రమాదం జరిగింది. అక్కడ స్లోప్ ఎక్కువగా ఉండగా.. కొందరు అదే స్పీడు‌తో వెళుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రమాదం జరుగుతుందని సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా ఉండటంతో ప్రమాదం తప్పలేదు.

 30 vehicles damaged in road accident on Pune highway

ఒక వాహనం వెనకాల మరొటి ఢీ కొన్నాయి. దీంతో దాదాపు 30 వాహనాలు దెబ్బతిన్నాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. వాహనాలు దెబ్బతిన్నట్టు ఫుటేజీలో కనిపించింది. కొందరు గాయపడి ఉంటారు. కడపటి వార్త అందేవరకు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.

అసలే ఆదివారం.. హాలీ డే మూడ్‌లో ఉంటారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఒకదాని వెంట మరొకటి ఢీ కొన్నాయి. ఫోటోలలో మాత్రం కార్లు ఘోరంగా దెబ్బతిని కనిపించాయి. కారు ముందుభాగం దాదాపుగా నుజ్జు నుజ్జు అయ్యాయి. అందులో ఉన్నవారు సీటు బెల్ట్ పెట్టుకోవడంతో సేఫ్ అయ్యారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది.

English summary
30 vehicles were damaged in a major road accident in Pune’s Navale Bridge area on Sunday. fire department has deployed its personnel and a rescue operation is currently underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X