వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడంతస్థుల భవనంలో మంటలు, నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

 4 killed in Mumbai building fire
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై శివారులోని విక్రోలీలో గల ఏడంతస్థుల భవనంలో సోమవారం మంటలు లేచాయి. ఈ సంఘటనలో నలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

సిద్ధార్థనగర్ ప్రాంతంలోని భవనంలో సోమవారం ఉదయం మంటలు లేచాయని ఫైర్ బ్రిగేడ్ వర్గాలు పిటిఐ వార్తా సంస్థతో చెప్పాయి. అగ్ని ప్రమాదానికి గురైంది నివాస భవనం. మంటలు అంటుకున్న సమయంలో భవనంలోని చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో మంటలు లేచినట్లు తెలుస్తోంది. గౌతం 955), అతని భార్య పూర్ణిమ (50), కుమారుడు విశాల్ (32), మనువడు (10) మంటల్లో కాలిపోయారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అయితే, అసలు కారణమేమిటనే తెలియడం లేదు.

English summary
Four persons were killed and eight others got injured when a fire broke out in a seven-storey building in suburban Vikhroli early on Monday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X