పేరు మోసిన పాఠశాలలో నాలుగేళ్ల పాపపై అఘాయిత్యం
కోల్కతా: కోల్కతాలోని ప్రసిద్ధి చెందిన పాఠశాలల్లో ఒక్కటైన జీడీ బిర్లా పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై అధ్యాపకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎల్కేజీ చదువుతున్న చిన్నారి టాయిలెట్కు వెళ్లిన సమయంలో టీచర్ అక్కడే అత్యాచారం జరిపాడు.
అఘాయిత్యానంతరం మర్మాంగాల దగ్గర నొప్పి రావడం, రక్తస్రావరం జరగడంతో పాప ఏడ్వసాగింది. దీంతో చిన్నారిని క్లాస్ టీచర్ ఇంటికి పంపించారు. ఇంటికి చేరుకున్న చిన్నారి స్కూల్ యూనిఫామ్ మీద రక్తపు మరకలను తల్లిదండ్రులు గుర్తించారు.

ఏడుస్తున్న చిన్నారిని అడిగితే, మర్మాంగాల దగ్గర నొప్పి ఉందని చెప్పింది. ఘటన జరిగిన రెండుగంటల తరువాత కూడా రక్తస్రావం ఆగలేదు, దీంతో చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు కూడా చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని స్పష్టం చేశారు. దీంతో తల్లిదండ్రులు సదరు టీచర్, పాఠశాల యాజమాన్యం మీద కేసు పెట్టారు. చిన్నారిపై డ్రిల్ మాస్టర్ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్కూల్ అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications