బాంబ్ పేల్చిన మోదీ : 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, దీదీకి షాకిచ్చిన మోదీ
కోల్ కతా : మండుటెండల్లో సార్వత్రిక ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ డేంజర్ బెల్స్ మోగించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మారథం పడుతోన్నారని .. కాంగ్రెస్, టీఎంసీ మరింత బలహీనపడుతాయని జోస్యం చెప్పారు. ఆయన ఇవాళ బెంగాల్ లోని హుగ్లీలో ప్రచారం నిర్వహించారు.
టచ్లో 40 మంది ఎమ్మెల్యేలు
మమతా బెనర్జీకి ప్రమాద ఘటింకలు మోగించారు మోదీ. టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. లోక్ సభ ఎన్నికల్లో కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మే 23 తర్వాత టీఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు దీదీని వీడుతారని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఆ 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు.

కమలం వికసిస్తోంది
ఈ ఎన్నికల్లో బెంగాల్లో నిశబ్ధ వాతావరణం ఉందని మోదీ పేర్కొన్నారు. ఇది బీజేపీ వికసానికి దారితీస్తోందని అంచనా వేశారు. ఈ ఎన్నికలతో టీఎంసీ, కాంగ్రెస్ను ప్రజలు తరమికొడతారని స్పష్టంచేశారు. బెంగాల్ ప్రజలను మమత వంచించారని .. అందుకు ధీటుగా ఆమెకు ప్రజలు బుద్ధిచెప్తారన్నారు ప్రధాని మోదీ.












Click it and Unblock the Notifications