Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Uttarakhand Tunnel: మళ్లీ ఆగిన ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్-సొరంగంలోనే 41 మంది..

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సొరంగంలో వారిని బయటకు రప్పించేందుకు వారం రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సాంకేతిక కారణాలతో లోపలికి వెళ్లే పరిస్దితి లేకుండా పోతోంది. దీంతో కేవలం లోపల చిక్కుకున్న వారికి పైపులైన్ ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా మాత్రమే చేస్తున్నారు. నిన్న సొంరంగం నుంచి 41 మందిని తెచ్చేస్తున్నామంటూ హడావిడి చేసిన ప్రభుత్వం చివర్లో సైలెంట్ అయిపోయింది.

తాజాగా మీడియాతో మాట్లాడిన సీనియర్ అధికారులు.. సొరంగంలో చిక్కుకున్న నిర్మాణ కార్మికులను చేరుకోవడానికి కేవలం 10-12 మీటర్ల డ్రిల్లింగ్ మాత్రమే మిగిలి ఉందని ప్రకటించారు. గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్ తదుపరి ఐదు మీటర్లలో ఎటువంటి ముఖ్యమైన లోహ అడ్డంకులను గుర్తించలేదని తెలిపారు. కూలిపోయిన సొరంగం కింద చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకోవడానికి సొరంగం పైభాగంలో ఇవాళ బోర్ చేయడానికి మరొక డ్రిల్లింగ్ యంత్రాన్ని సైట్‌కు తీసుకువచ్చారు.

41 workers in uttarakhand tunnel to wait for more time as rescue operations halted again

సొరంగంలోకి డ్రిల్లింగ్ మెషిన్ వెళ్లినప్పుడు ఉక్కు పైపు ఆరు-మీటర్ల విభాగాలు కలిసి వెల్డింగ్ చేస్తారు. అలాగే ఇరుకైన సొరంగం మార్గంలోకి వీటిని నెడతారు. స్టీల్ చ్యూట్ ఏర్పాటు తర్వాత కొత్తగా తవ్విన సొరంగం ద్వారా కార్మికులను సురక్షితంగా తరలించడానికి చక్రాల స్ట్రెచర్‌లను వాడాలని భావిస్తున్నారు. డ్రిల్లింగ్ మెషిన్ చెక్కిన మార్గం ద్వారా డ్రిల్ బిట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు నిన్న సాయంత్రం ఆపరేషన్ సిబ్బంది తెలిపారు. రెండు రోజుల్లో ఎదురైన రెండు ఎదురుదెబ్బలు చాలా రోజులుగా సొరంగం వెలుపల వేచి చూస్తున్న కార్మికుల బంధువుల్లో ఆందోళన మరింత పెంచుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+