ఘోర ప్రమాదం: బస్సును ఢీకొన్న రైలు, 6గురు చిన్నారుల మృతి

గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అజంఘర్ - వారణాసి పాసింజర్ రైలు వారణాసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాసింజర్ రైలు వెళ్లే సమయంలో బస్సు క్రాసింగ్ దాటుతుండగా ఇది జరిగింది. మావ్ - కురాహట్ మధ్యన ఈ క్రాసింగ్ ఉంది.
నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఆరుగురు చిన్నారులు మృతి చెందారని, 16 మంది చిన్నారులు గాయపడ్డారని చెప్పారు. మావ్ రైల్వే పోలీసులు, అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications