అక్కడ ఇంతవరకు మహిళలు పోటీచేయలేదు..! ఈసారి మాత్రం ఎన్నికలకు సై
ఐజ్వాల్ : ఈసారి మిజోరం లోక్సభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిజోరం పార్లమెంటరీ స్థానంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి మహిళ ఎన్నికల బరిలోకి దిగడం చర్చానీయాంశమైంది. మిజోరం స్టేట్ లో ఉన్న ఒకే ఒక్క లోక్సభ స్థానం కోసం ఆరుగురు పోటీపడుతున్నారు. అందులో 63 ఏళ్ల మహిళ లాల్త మౌని ఒకరు కావడం విశేషం. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
మిజోరం పార్లమెంటరీ స్థానానికి 1972లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటివరకు రెండు మూడు సార్లు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. అంతేకాదు చాలాసార్లు గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఒకరకంగా ఇక్కడ ఇండిపెండెంట్ల హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. అదే క్రమంలో ఈసారి తొలిసారిగా మహిళ పోటీ చేస్తుండటం చర్చానీయాంశంగా మారింది.

ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ అయిన ఈ పార్లమెంటరీ స్థానంలో 7 లక్షల 84 వేల 339 మంది ఓటర్లున్నారు. ఇక్కడ పురుష ఓటర్లు 3 లక్షల 81 వేల 991 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 4 లక్షల 2 వేల 408 మంది ఉన్నారు. తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. 2018లో దక్షిణ ఐజ్వాల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా ఆమె పోటీపడ్డారు. అప్పుడు 69 ఓట్లు వచ్చాయి. అయితే లాల్త మౌని ఈసారి లోక్సభ బరిలోకి దిగుతుండటంతో తొలిసారిగా మహిళలు పోటీచేస్తున్నట్లైంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications