Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 20 మందికి సీరియస్..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, రెండు ట్రక్కులు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. పూణేలోని నేవల్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

8 Charred to Death Deadly Accident Shocks Maharashtra

మహారాష్ట్రలోని పూణే లోని నేవల్ బ్రిడ్జి వద్ద ఓ టక్కు అదుపుతప్పి ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొట్టింది. ఓ కారు, మరో ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో 8 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పూణే- బెంగళూరు హైవే నేవల్ బ్రిడ్జి సమీపంలోని సెల్ఫీ పాయింట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటనతో నడి రోడ్డుపై మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న మరో 6 కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. దీంతో పూణే- బెంగళూరు హైవేపై గంటలపాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+