టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం: 8మంది మృతి
థానే: మహారాష్ట్రలోని భీవండిలో ఓ టింబర్ డిపోలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. భీవండి పట్టణంలో మాద్వి కాంపౌండ్లోని టింబర్ గోడౌన్లో గోడౌన్లో అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో మరణించిన వారందరూ అక్కడ పనిచేసే కార్మికులేనని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు డజను అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేశారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది.
అస్సాంలో మృతుల సంఖ్య 81
గౌహతి: బోడో తీవ్రవాదుల దాడుల్లో మృతుల సంఖ్య 81కి చేరింది. తీవ్రవాదులు దాడులు జరిపిన గౌహతి, సోనిట్పూర్, కొక్రాఝర్ ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్సింగ్ శనివారం పర్యటించారు.