వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం: 8మంది మృతి

|
Google Oneindia TeluguNews

థానే: మహారాష్ట్రలోని భీవండిలో ఓ టింబర్ డిపోలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. భీవండి పట్టణంలో మాద్వి కాంపౌండ్‌లోని టింబర్ గోడౌన్‌లో గోడౌన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో మరణించిన వారందరూ అక్కడ పనిచేసే కార్మికులేనని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు డజను అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేశారు.

8 Killed in Bhiwandi Timber Mart Fire

అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది.

అస్సాంలో మృతుల సంఖ్య 81

గౌహతి: బోడో తీవ్రవాదుల దాడుల్లో మృతుల సంఖ్య 81కి చేరింది. తీవ్రవాదులు దాడులు జరిపిన గౌహతి, సోనిట్‌పూర్, కొక్రాఝర్ ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ శనివారం పర్యటించారు.

English summary
At least eight persons were today charred to death and three others seriously injured in a fire in a timber mart in the powerloom town of Bhiwandi in Thane, police and fire officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X