వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెట్టును ఢీకొన్న కారు: 8 మంది విద్యార్థుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కడలూరు సమీపంలోని వానమతిదేవి గ్రామ శివారులో కారు చెట్టును ఢీకొనడంతో ఆ ప్రమాదం సంభవించింది.

మృతులు సేలంలోని ఎంఐటి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు. మృతదేహాలను కడలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థుల మరణంతో వారి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Cuddalore accident

ప్రమాదం నుంచి ఒక్క విద్యార్థి బయటపడ్డాడు. విద్యార్థులు తాగి ఉన్నారని, దానివల్లనే కారును వేగంగా నడిపించారని అనుమానిస్తున్నట్లు జిల్లా సూపరింటిండెంట్ విజయకుమార్ చెప్పారు.

కారులో పరిమితికి మించి కూర్చున్నారని కూడా చెప్పారు. ప్రమాదం సంభవించిన రోడ్డు మీద ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

English summary
Eight students were killed in a road accident in the Cuddalore district of Tamil Nadu as their car hit a tree at Vanamadevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X