రాష్ట్రపతి భవన్ లో అగ్నిప్రమాదం, అకౌంట్స్ విభాగంలో !
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రపతి భవన్ లోని అకౌంట్స్ విభాగంలో శుక్రవారం మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రపతి భవన్ లోని అకౌంట్స్ విభాగంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అక్కడి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఆరు వాహనాలతో సంఘటనా స్థలానికి హుటాహూటీన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 నిమిషాల వ్యవధిలో మంటలు అదుపులోకి తీసుకు వచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో రాష్ట్రపతి భవన్ లోని అకౌంట్స్ విభాగంలో ఉన్న సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగా మంటలువ్యాపించాయని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి విలువైన డాక్యుమెంట్లు బూడిద కాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు. పోలీసులు ఈ విషయంపై విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications