ఘోరం: తొమ్మిదేళ్ల బాలిక తల నరికిన పదో తరగతి విద్యార్థిని
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని దుంగార్పూర్లోని గిరిజన బెల్ట్లోని ఒక గ్రామంలో ఒక మైనర్ బాలిక సోమవారం తన తొమ్మిదేళ్ల మేనకోడలిని కత్తితో పొడిచి చంపింది.
సోమవారం తెల్లవారుజామున 15 ఏళ్ల బాలిక, ఆమె కుటుంబం తమ ఇంటిలోని ఒక గదిలో దశ మాతకు పూజలు చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమె బెదిరిపోయి.. గదిలో ఉంచిన కత్తిని బయటకు తీసి.. హింసాత్మకంగా కదలడం ప్రారంభించిందని చితారి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గోవింద్ సింగ్ తెలిపారు.
కత్తితో బాలికను చూసిన తల్లిదండ్రులు భయంతో పరుగులు తీశారు. అయితే, మరో గదిలో ఉన్న తొమ్మిదేళ్ల మేనకోడలు వర్ష వద్దకు వెళ్లి ఆమెను కత్తితో తీవ్రంగా దాడి చేసింది. అత్యంత దారుణంగా మేనకోడలి తలను శరీరం నుంచి వేరుచేసింది.
సదరు బాలిక 10వ తరగతి విద్యార్థిని, అని హాస్టల్లో ఉంటోందని సగ్వారా సర్కిల్ ఆఫీసర్ నర్పత్ సింగ్ తెలిపారు. కొన్ని రోజుల క్రితమే ఆమె ఇంటికి వచ్చింది.
"ఆమె ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమె సాధారణంగా ప్రవర్తించడం లేదు. ఆమెకు చికిత్స అవసరమని తెలుస్తోంది. పూజ కారణంగా ఆమె రెండు రోజులుగా ఏమీ తినలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందాన్ని పిలిపించామని, అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని ఎస్హెచ్ఓ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications