మూడు నెలల శిశువుపై కుక్కల దాడి... తలను, మొండాన్ని వేరు చేసిన వీధి కుక్కలు...!
యుపీలో వీధి కుక్కలు స్థ్రైర్య విహారం చేశాయి. ఇంటి ముందు, ఆరుబయట పడుకున్న మూడు నెలల పసికూనను నోటితో కరుచుకుని తీసుకువెళ్లాయి...పక్కనే ఉన్న పోలంలోకి పిల్లాడిని తీసుకెళ్లిన కుక్కులు అతి దారుణంగా పిల్లాడి తలను వేరు చేశాయి. అయితే పిల్లాడి కోసం గాలిస్తున్న తల్లిదండ్రులకు పక్కన ఉన్న పోలంలో పిల్లాడి మొండెం మాత్రమే లభించింది.
ఉత్తర ప్రదేశ్లోని సహార్ణపూర్ జిల్లాలోని దయాల్పూర్ గ్రామంలో ఉదయం ఆరుబయట నిద్రిస్తున్న మూడు నెలల పిల్లాడిపై వీధి కుక్కలు దాడి చేశాయి..అనంతరం పిల్లాడిని నోటితో కరుచుకుని తీసుకువెళ్లాయి...అనంతరం తలను మొండాన్ని వేరు చేశాయి...అయితే తమ పిల్లాడి కోసం వెతుకుతున్న కుటుంభ సభ్యులకు పోలంలో పిల్లాడి తల లేని మొండం మాత్రమే కనిపించింది.
దీంతో లబోదిబోమన్న కుటుంభ సభ్యులు ఆందోళన బాట పట్టారు. వీధికుక్కల భారీ నుండి తమను కాపాడాలని కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉందని వాపోతున్నారు. మరోవైపు గత సంవత్సరం ఎప్రిల్లో కూడ సీతాపూర్ జిల్లాలో 12 మంది పిల్లలపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి.దీంతో తమ పిల్లలను స్కూల్కు పంపించడం ఆపి వేశారు తల్లిదండ్రులు.