ఆధార్ తప్పనిసరి దేశ భద్రతకు ముప్పు: సుబ్రహ్మణ్య స్వామి
ఆధార్ పైన బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధార్ దేశ భద్రతకు ముప్పు అని చెప్పారు.
న్యూఢిల్లీ: ఆధార్ పైన బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధార్ దేశ భద్రతకు ముప్పు అని చెప్పారు.
ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. పలు సంక్షేమ పథకాలకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే పలువురు వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా మండిపడటం గమనార్హం. ఆధార్ను తప్పనిసరి చేయడం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశముందని, ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నానని, దీనిపై సవివరంగా ప్రధాని నరేంద్ర మోడీకి త్వరలోనే లేఖ రాస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications