కేజ్రీ పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్పై దాడి, నేతలకు సిఎం హితవు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత, ఎమ్మెల్యే మనోజ్ కుమార్ కార్యాలయం పైన కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఓ మహిళ సహా సుమారు యాభై మంది మనోజ్ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని కోండ్లి ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ ఘటనపై శాసన సభ్యులు మనోజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ, ఆమెతో వచ్చిన వారు తమ కార్యాలయం పైన దాడి చేశారని, ఈ ఘటనలో తాను మరో ఇద్దరు గాయపడ్డారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

మరోవైపు తమను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బంధించి కొట్టారని దాడికి పాల్పడిన వారు ఫిర్యాదు చేశారు. పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు అందాయి.
కాగా, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ)కి చెందిన వారు ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని బిఎస్పీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షులు బ్రహ్మ సింగ్ ఖండించారు. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ తమ పార్టీకి చెందిన వారెవరూ లేరని ఆయన చెబుతున్నారు.
మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో ఎలాంటి విభేదాలు ఉన్నా ఆయన చాలా మంచివారని, తానంటే ఆయనకు చాలా అభిమానమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎఎపి నేతలు విమర్శలు చేసే సమయంలో తమ భాష పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్ సూచించారు. ఎఎపి నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ను కాంగ్రెసు ఏజెంటుగా ఆరోపించడంపై కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications