కేజ్రీ పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్పై దాడి, నేతలకు సిఎం హితవు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత, ఎమ్మెల్యే మనోజ్ కుమార్ కార్యాలయం పైన కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఓ మహిళ సహా సుమారు యాభై మంది మనోజ్ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని కోండ్లి ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ ఘటనపై శాసన సభ్యులు మనోజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ, ఆమెతో వచ్చిన వారు తమ కార్యాలయం పైన దాడి చేశారని, ఈ ఘటనలో తాను మరో ఇద్దరు గాయపడ్డారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

మరోవైపు తమను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బంధించి కొట్టారని దాడికి పాల్పడిన వారు ఫిర్యాదు చేశారు. పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు అందాయి.
కాగా, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ)కి చెందిన వారు ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని బిఎస్పీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షులు బ్రహ్మ సింగ్ ఖండించారు. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ తమ పార్టీకి చెందిన వారెవరూ లేరని ఆయన చెబుతున్నారు.
మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో ఎలాంటి విభేదాలు ఉన్నా ఆయన చాలా మంచివారని, తానంటే ఆయనకు చాలా అభిమానమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎఎపి నేతలు విమర్శలు చేసే సమయంలో తమ భాష పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్ సూచించారు. ఎఎపి నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ను కాంగ్రెసు ఏజెంటుగా ఆరోపించడంపై కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications