షాకింగ్: టీవీ లైవ్ షోలో మాట్లాడుతూ కన్నుమూసిన సామాజిక కార్యకర్త

శ్రీనగర్: టీవీ ఛానల్ లైవ్ షోలో ప్రముఖ మహిళా స్కాలర్ గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. ఈ విషాధ సంఘటన జమమ్ము కాశ్మీర్‌లో సోమవారం జరిగింది. డోగ్రీ స్కాలర్ కమ్ సామాజిక ఉద్యమకారిణి పేరు రీటా జితేందర్. ఆమె లైవ్ షోలో మాట్లాడుతూనే కన్నుమూశారు.

దూరదర్శన్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్న ఓ టాక్‌ షో ప్రత్యక్ష ప్రసారంలో యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతున్నారు. ఆ సమయంలో మధ్యలో గుండెపోటు వచ్చింది. నిర్వాహకులు స్పందించి రీటాకు ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు మృతి చెందారు.

Activist Rita Jetinder collapses on live TV during talk show in J&K, dies

ఆమె ఆఖరి క్షణాల్లో కుర్చీలో వెనక్కు వాలిపోయిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన వారంతా షాకవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటున్నారు. రీటా జితేందర్‌ గతంలో జమ్ము కాశ్మీర్‌ భాషా, సాంస్కృతిక అకాడమీకి కార్యదర్శిగా పనిచేశారు.

ఈ ఏడాది జనవరిలో కేరళకు చెందిన ఆర్టిస్ట్ కాళమండలం గీతానందన్ త్రిసూర్ జిల్లాలో గుడిలో ప్రదర్శన చేస్తూ కన్నుమూశారు. గీతానందన్ వయస్సు 58.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+