5రాష్ట్రాలు: మోడీ ప్రభావంపై అద్వానీ, అసంతృప్తితోనేనా?
విజయంలో మోడీ ప్రభావం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. ఈ విజయం అందరిదని, ముఖ్యంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులదని చెప్పారు.
అద్వానీ పార్లమెంటు కాంప్లెక్సులో బుధవారం మాటలాడారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లు రాష్ట్రాలను బాగా అభివృద్ధి చేశారన్నారు.
రమణ్ సింగ్, శివ్రాజ్ సింగ్ చౌహాన్లు బాగా కష్టపడ్డారని, వారికి పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అద్వానీ తెలిపారు. కాగా, అద్వానీ వ్యాఖ్యల ద్వారా మోడీ పట్ల ఆయన ఇంకా అసంతృప్తిగా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అవిశ్వాస తీర్మానం చర్చకు రానీయకుండా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయని అద్వానీ అన్నారు.