గుజరాత్ తర్వాత బీజేపీకి మరో షాక్: రాజస్థాన్లో సత్తా చాటిన కాంగ్రెస్
జైపూర్: పటీదార్, ఓబీసీ, దళిత యువ నాయకుల అండ, ఎన్నికల ప్రచార సమయంలో గుళ్లు గోపురాలు తిరిగి గుజరాత్లో ఓడినా పరువు నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్లో మరో ఊరట. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.
45 సీట్లకు గాను 26 స్థానాల్లో గెలుపొందింది. బన్స్వారా, భిల్వారా, జలోర్, కరౌలి జిల్లా పరిషత్లలోను కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. నాలుగు జిల్లా పరిషత్లకు తోడు 27 పంచాయతీ సమితుల్లో 16 స్థానాల్లో గెలుపొందింది.

బీజేపీ కేవలం 10 పంచాయతీ సమితి సీట్లు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ అర్బన్ లోకల్ బాడీలోనే 7 స్థానాలు గెలుచుకుంది. అక్కడ కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
అయితే నాలుగు జిల్లా పరిషత్లలో ఒక్క సీటును కూడా బీజేపీ గెలుచుకోలేదు. 19 జిల్లాల్లోని 27 పంచాయతీ సమితిలకు, 13 జిల్లాల్లోని 14 నగర పాలికలకు, నాలుగు జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరగాయి. మొత్తంగా కాంగ్రెస్ 26 స్థానాల్లో గెలిచింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications