అమితాబ్ బచ్చన్: నేపాల్ భూకంప బాధితులకు చేతనైనంత సాయం చేద్దాం..!
ముంబై: వరుస భూప్రకంపనలతో అతలాకుతలమైన నేపాల్ భూకంప బాధితులకు సాయం అందించేందుకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. భూకంప బాధితుల కోసం తన వంతుగా సాయం చేస్తానంటున్నారు. అంతే కాదు దేశంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత వారం నేపాల్లో సంభవించిన భూకంపంతో నేపాల్లోని పురాతన భవనాలు, భవంతులు నేలమట్టమైన సంగతి తెలిసిందే.
ఈ భూకంప వల్ల నేపాల్లో ఎంతో మంది నిరాశ్రయులవ్వగా, దాదాపు 5వేలకు పైగా మరణించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. బీగ్ బీ బుధవారం ట్విట్టర్లో 'భూకంప బాధితులు కుదురుకుని, విశ్రాంతి తీసుకున్నాక త్వరలోనే మన అన్నదమ్ములు, సోదరీమణులకు మన వంతు సాహాయం తప్పకుండా చేయాలి. సమయం గడచిపోతుంది. కానీ, ఆలోచనలు, ప్రార్ధనలు మాత్రమే నేపాల్, భారత్ భూకంప బాధితుల్లో మిగిలి ఉంటాయి' అని ట్వీట్ చేశారు.
భూకంప వినాశకర వీడియోలు చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉన్నాయని, ప్రకృతి క్రూరత్వాన్ని తన క్రూరత్వాన్ని మాటల్లో చెప్పలేని విధంగా నేపాల్ ప్రజలపై చూపించిందన్నారు. గత శనివారం నేపాల్లో రేక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి గాను నేపాల్ రాజధాని కాఠ్మండు పూర్తిగా ధ్వంసమైంది. ఈ భూకంప ప్రభావం 80 లక్షల మందికి పైగా పడిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
T
1847
-
Yes
..
they
say
life
goes
on
much
like
'the
show
must
go
on'
..
but
somewhere
the
heart
does
not
agree
..
please
Lord
be
merciful
!
—
Amitabh
Bachchan
(@SrBachchan)
April
27,
2015
T
1847
-
Soon
when
all
is
rested
and
settled,
we
must
do
whatever
we
can
in
helping
our
brothers
and
sisters
who
have
suffered
!!
—
Amitabh
Bachchan
(@SrBachchan)
April
27,
2015
T
1847
-
The
devastating
visuals
that
one
sees
is
so
frightening
..
nature's
fury
is
unmatched,
but
so
is
human
effort
and
prayer
!!
—
Amitabh
Bachchan
(@SrBachchan)
April
27,
2015