అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు: సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం - Newsreel

అమరావతి భూముల విషయంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో చేపట్టిన దర్యాప్తు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఈ కేసులో మూడు రోజుల క్రితమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
దీంతో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులోనూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం చేసిన భూసేకరణలో అవినీతి జరిగిందంటూ నమోదైన ఎఫ్ఐఆర్లో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
వీరిలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురున్నారు.
- అమరావతిలో భూముల ధరలు: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలా మారాయి?ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నదీ జలాలపై రివర్ బోర్డులకు పెత్తనం ఇస్తే ఏం జరుగుతుంది?
వైఎస్ జగన్ విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి భూముల ల్యాండ్ ఫూలింగ్ సహా పలు విధానాలను ప్రశ్నించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.
రాజధాని ఏర్పాటుకి సంబంధించి ముందే సమాచారం తెలుసుకున్న కొందరు, అమరావతి ప్రాంతంలో చౌకగా భూములు కొనుగోలు చేశారన్నది ప్రధాన అభియోగం.
దీనిపై సిట్ దర్యాప్తులో భాగంగా నమోదైన ఎఫ్ఐఆర్ విషయం వివాదాస్పదమయ్యింది.
- హైదరాబాద్ రోడ్ డాక్టర్: సొంత ఖర్చుతో గుంతలు పూడుస్తున్న రిటైర్డ్ ఇంజనీర్
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన

ఈ కేసు చెల్లదంటూ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురు ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు.
వాటిని విచారించిన హైకోర్టు ఈ కేసులో విచారణ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతేగాకుండా ఈకేసుకి సంబంధించిన అంశాలను సోషల్ మీడియా సహా ఎక్కడా ప్రస్తావించకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది.
గత ఏడాది సెప్టెంబర్లో ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులపై పెద్ద దుమారమే రేగింది.
అప్పట్లో ఏపీ సీఎం నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలు ఆరోపణలతో కూడిన లేఖలు రాశారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన ఏపీ ప్రభుత్వం, తన పిటిషన్ని ఉపసంహరించుకోవడం ఆసక్తిగా మారింది.
ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ మఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకి తెలిపారు.
ఈ కేసు విచారణను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సూచించింది.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications